CM Revanth Reddy: ఇవాళ్టి నుంచి కుటుంబ డిజిటల్ కార్డులు.. ప్రారంభించనున్న సీఎం
- నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు కుటుంబ డిజిటల్ కార్డులు..
- ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం..
- నేడు కుటుంబ డిజిటల్ కార్డుల పక్రియను ప్రారంభించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు అన్ని సంక్షేమ పథకాలను ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో ఇంటింటికీ తనిఖీలు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. నియోజక వర్గంలో పూర్తిగా రూరల్గా ఉన్న రెండు గ్రామాల్లో, పూర్తిగా పట్టణ, నగర పరిధిలోని రెండు వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్ట్ను చేపట్టనున్నారు.
Read also: Dasara Navaratri Utsavalu 2024: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
అధికారుల బృందాలు క్షేత్రస్థాయి విచారణలో కుటుంబాలను నిర్ధారిస్తాయి, కొత్త సభ్యులను చేర్చుకుంటాయి మరియు చనిపోయిన వారి పేర్లను తొలగిస్తాయి. కుటుంబ పెద్ద మహిళను యజమానిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు కార్డు వెనుక భాగంలో ప్రచురించబడతాయి. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫోటో తీయాలని, ఐచ్ఛికంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. రోజుకు 30-40 ఇళ్లు సర్వే లక్ష్యంగా.. పైలట్ ప్రాజెక్టును నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. ఐదు రోజుల పైలట్ ప్రాజెక్టులో ఎదురవుతున్న సానుకూలతలు, ఇబ్బందులను సమీక్షించి మార్పులు చేర్పులు చేయాలని, కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
PM Internship Scheme: ‘పీఎం ఇంటర్న్షిప్’ పథకం నేటి నుంచి ప్రారంభం.. దరఖాస్తుతో ఈ ప్రయోజనాలు
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?