PM Internship Scheme: ‘పీఎం ఇంటర్న్షిప్’ పథకం నేటి నుంచి ప్రారంభం.. దరఖాస్తుతో ఈ ప్రయోజనాలు
- 'పీఎం ఇంటర్న్షిప్' పథకం నేటి నుంచి ప్రారంభం
- ఇందుకోసం పోర్టల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Internship Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్లో పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం పోర్టల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇంటర్న్ కోసం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 నుండి ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే 5 సంవత్సరాలలో, దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవ్వబడతాయి. ఇంటర్న్షిప్ అలవెన్స్ ప్రతి నెలా రూ.5,000.. ఏకమొత్తంలో రూ.6,000 ఇవ్వబడుతుంది. ఉపాధి అవకాశాల కోసం 12 నెలల అనుభవం అందుబాటులో ఉంటుంది. కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఫండ్ నుండి శిక్షణ ఖర్చు, ఇంటర్న్షిప్ ఖర్చులో 10 శాతం భరిస్తాయి.
‘అమృత్’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
10 వేల కోట్లతో పరిశుభ్రతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులలో మిషన్ అమృత్, అమృత్ 2.0 కూడా ఉన్నాయి. దీని కింద దేశంలోని అనేక నగరాల్లో నీరు, వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
Read Also: Kangana Ranaut: మళ్లీ నోరుజారిన కంగన.. గాంధీ జయంతి నాడు చేసిన పోస్ట్పై వివాదం
స్వచ్ఛ భారత్ మిషన్పై ప్రధాని మోడీ
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కోట్లాది మంది దేశప్రజల అచంచలమైన నిబద్ధతకు స్వచ్ఛ్ భారత్ మిషన్ యాత్ర ప్రతీక అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన సామూహిక ఉద్యమంగా అభివర్ణిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రయాణంలో ప్రతి ప్రయత్నం ‘పరిశుభ్రత శ్రేయస్సు’ మంత్రాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. గత పదేళ్లుగా, భారతీయులు ఈ మిషన్ను స్వీకరించారని, తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారన్నారు. పదేళ్ల ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన ప్రతి ఒక్కరిని, సఫాయి మిత్రలు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహచరులను ప్రధాని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి కృషి స్వచ్ఛ భారత్ మిషన్ను భారీ ప్రజా ఉద్యమంగా మార్చిందని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి కూడా పరిశుభ్రత సేవలో తమ వంతు సహకారం అందించారని, దేశానికి గొప్ప స్ఫూర్తిని అందించారన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కూడా సర్క్యులర్ ఎకానమీకి కొత్త ఊపునిచ్చింది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!