CM Revanth Reddy: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
- నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..
- ఈరోజు ఉదయం 11.54 గంటలకు భూమిపూజ కార్యక్రమం..
- కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర్ రాజనర్సింహ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు (జనవరి 31) ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.54 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఈ ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం దవాఖాన అఫ్జల్గంజ్లో ఉండగా.. నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించబోతున్నారు. రెండు వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవనం కార్పొరేట్ హస్పటల్స్ ను తలదన్నేలా ప్రభుత్వం నిర్మించాలని ప్లాన్ చేస్తుంది.
Read Also: Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
Also Read
- HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
ఇక, రాబోయే వందేళ్ల పాటు ప్రజల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో తెలిపారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు ఒక పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఉండాలన్నారు. అలాగే, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నొస్టిక్ సేవలు ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో ఈ నూతన భవన నిర్మాణానికి సుమారు రూ.2700 కోట్ల వరకు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20 శాతం వైద్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల రోజుకు ఐదు వేల మంది ఓపీ రోగులను చూడటంతో పాటు 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం చూస్తుంది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?