CM Revanth Reddy: ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువ..
- మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే..
- ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువ..
- ఆ కండ్లు చూడండి.. విషపుంతో నిండిపోయాయి: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే మీరాలం బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి.. ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అవుతుంది. దాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక, రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ.. దానికి వసతులు కల్పించడం.. ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంది అన్నారు. ఇక, మూడు కోట్ల తెలంగాణ జనాభాలో కోటి 34 లక్షల మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు.. వచ్చే 20 ఏళ్లలో 75 శాతం జనాభా హైదరాబాద్ కి వస్తారని అసెంబ్లీలో సీఎం పేర్కొన్నారు. అయితే, కడుపు నిండా మూసీలో కంటే ఎక్కువ విషం ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Read Also: 50MP ట్రిపుల్ కెమెరా, 90W ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ తో Moto X70 Air Pro లాంచ్కు రెడీ..!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
అయితే, ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మేము వివరాలు చెప్తుంటే.. ఎందుకు విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజలకు తెలియొద్దని వాళ్ళ బాధపడుతున్నారు.. ఆ కండ్లు చూడండి.. విషపుంతో నిండిపోయాయి.. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేను తీసుకుని మూసీ కార్పొరేషన్ చైర్మన్ చేసిన వాళ్లా చెప్పేది.. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను చూసి నేర్చుకోండి అని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలను అభివృద్ధి చేయండి అని వెల్లడించారు. ఉప్పల్ ఎమ్మెల్యే కూడా వచ్చి చెప్పాడు.. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? అని ప్రశ్నించారు. ప్రక్షాళన చేయాలి అంటే సలహాలు ఇవ్వండి.. నష్టపోతున్న వారికి కాలనీ కట్టిస్తాం.. నష్టపోయిన వారికి వ్యాపారం చేసుకునే వేసులుబాటు కల్పిస్తామని రేవంత్ చెప్పారు.
Read Also: CM Revanth Reddy: ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన.. ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేటలో కలిపారు..
ఇక, మూసీ ప్రక్షాళన వద్దు అనే వాళ్లు.. అంబర్ పేట శ్మశాన వాటిక దగ్గరికి పోయి చూడమని చెప్పండి.. ప్రపంచ స్థాయి కంపనీలకు ఇస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఇవ్వడం, కమిషన్ లు తీసుకోవడం మాకు రాదని తెలిపారు. మేము 80 వేల పుస్తకాలు చదవలేదు.. ఇప్పుడే మూసీ ప్రక్షాళనకి ఎంత అవుతుందని మేము ఇప్పుడే చెప్పలేం.. మూసీ పరివాహక ప్రాంతంలో శివాలయం, గురుద్వార్, ఉప్పల్ సమీపంలో చర్చి కడతాం అన్నారు. DPR ఫైనల్ అయ్యాకా.. సభలో పెడతా, అందరి సలహాలు తీసుకుంటా.. బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ కడతామని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదిరింది. మీలాగా కేసులు నుంచి తప్పించుకోవడం కోసం కాదు అన్నారు. మూసి పరివాహక ప్రాంత MLA లు విదేశీ పర్యటన చేసి సలహాలు ఇవ్వండి.. ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది మేము మంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. మీరు సలహాలు ఇవ్వండి.. డీపీఆర్ రాగానే ఎమ్మెల్యేలు.. ఫ్లోర్ లీడర్స్ నీ పిలిచి చర్చిస్తా.. సలహాలు ఇస్తే తీసుకుంటా కడుపులో విషం తగ్గించుకోండి అని రేవంత్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!