CM Revanth Reddy: ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన.. ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేటలో కలిపారు..
- ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన..
- గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు..
- ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారు: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ అనంతగిరిలో ప్రారంభం అయి.. వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.. ఈసా, మూసా నదులు బాపూఘాట్ దగ్గర కలుస్తాయి.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాం.. మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశామన్నారు. ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- CM Revanth Reddy : హైదరాబాద్లో భారీ వర్షాలు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
ఇక, గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. అలాగే, ఫామ్ హౌస్ ల డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారని ఆరోపించారు. గండిపేట, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నవాళ్లు.. లక్షలు, కోట్లు ఖర్చు చేసి నాపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారు.. అయినా మేం భయపడలేదని వెల్లడించారు. ఇక, గుజరాత్ లో సబర్మతి ప్రాజెక్టు చేపట్టి 60 వేల కుటుంబాలను తరలించారు.. యూపీలో గంగా ప్రక్షాళన చేశారు.. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు.. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే, మూసీ పొల్యూషన్ వల్ల శిక్ష అనుభవిస్తుంది నల్గొండ ప్రజలు అని సీఎం రేవంత్ అన్నారు. మూసీ మురికి అంతా నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్గొండ వాళ్ళ మీద దేవుడే శిక్ష విధించాడు.. వాళ్ళ దురదృష్టం, వల్లకు దేవుడు శిక్ష విధించినట్టు ఉంది.. గండిపేట నుంచి వికారాబాద్ వరకు ప్రక్షాళన కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.. గోదావరి జలాలు రెండు ఏళ్లలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లో 21 కిలోమీటర్ల ప్రక్షాళన అంచనాలు ఫైనల్ చేస్తామని పేర్కొన్నారు. ఏడీబీ బ్యాంక్.. రూ. 4100 కోట్లు రుణం ఇస్తుంది.. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.. వచ్చే నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!