CM Revanth Reddy: ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన.. ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేటలో కలిపారు..
- ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన..
- గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు..
- ఫామ్ హౌస్ల డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారు: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ అనంతగిరిలో ప్రారంభం అయి.. వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.. ఈసా, మూసా నదులు బాపూఘాట్ దగ్గర కలుస్తాయి.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాం.. మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశామన్నారు. ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ఇక, గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. అలాగే, ఫామ్ హౌస్ ల డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారని ఆరోపించారు. గండిపేట, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నవాళ్లు.. లక్షలు, కోట్లు ఖర్చు చేసి నాపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారు.. అయినా మేం భయపడలేదని వెల్లడించారు. ఇక, గుజరాత్ లో సబర్మతి ప్రాజెక్టు చేపట్టి 60 వేల కుటుంబాలను తరలించారు.. యూపీలో గంగా ప్రక్షాళన చేశారు.. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు.. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే, మూసీ పొల్యూషన్ వల్ల శిక్ష అనుభవిస్తుంది నల్గొండ ప్రజలు అని సీఎం రేవంత్ అన్నారు. మూసీ మురికి అంతా నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్గొండ వాళ్ళ మీద దేవుడే శిక్ష విధించాడు.. వాళ్ళ దురదృష్టం, వల్లకు దేవుడు శిక్ష విధించినట్టు ఉంది.. గండిపేట నుంచి వికారాబాద్ వరకు ప్రక్షాళన కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.. గోదావరి జలాలు రెండు ఏళ్లలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లో 21 కిలోమీటర్ల ప్రక్షాళన అంచనాలు ఫైనల్ చేస్తామని పేర్కొన్నారు. ఏడీబీ బ్యాంక్.. రూ. 4100 కోట్లు రుణం ఇస్తుంది.. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.. వచ్చే నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!