Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, ఈ నెల మూడో వారంలోనే నల్లమల సాగర్ రిజర్వాయర్కు కృష్ణా జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రాజెక్టు పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కొల్లం వాగు నుంచి టన్నెల్స్ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు అవసరమైన అప్రోచ్ ఛానెల్ క్లియరింగ్ పూర్తైందన్నారు. రెండు టన్నెల్స్లో మిగిలిన 286 మీటర్ల లైనింగ్ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, టన్నెల్-2లో చిక్కుకుపోయిన టిబిఎం (TBM) యంత్రాన్ని తొలగించే ప్రక్రియ కూడా వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. 1,900 మెట్రిక్ టన్నుల బరువున్న టిబిఎం యంత్రంలో ఇప్పటికే 1,300 మెట్రిక్ టన్నులను వెలికితీసినట్లు, మిగిలిన 600 మెట్రిక్ టన్నులను కూడా 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని వెల్లడించారు.
Also Read
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి, ఐదేళ్లలో టిబిఎం యంత్రాన్ని తొలగించలేకపోయారని, చుక్క నీరు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రచారం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ.450 కోట్లతో ఫీడర్ కెనాల్లో కేవలం ఆరు నెలల్లోనే 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించి, 11 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసిందన్నారు. నిర్వాసితుల పునరావాసంపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,560 కుటుంబాలకు రూ.318 కోట్లు అందజేశామని చెప్పారు. ఈ వారం మరో 2,863 కుటుంబాలకు రూ.353 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. మిగిలిన 1,898 కుటుంబాలకు ఈ నెలాఖరులోగా రూ.210 కోట్లు చెల్లించి ఆర్అండ్ఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!