Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, ఈ నెల మూడో వారంలోనే నల్లమల సాగర్ రిజర్వాయర్కు కృష్ణా జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రాజెక్టు పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కొల్లం వాగు నుంచి టన్నెల్స్ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు అవసరమైన అప్రోచ్ ఛానెల్ క్లియరింగ్ పూర్తైందన్నారు. రెండు టన్నెల్స్లో మిగిలిన 286 మీటర్ల లైనింగ్ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, టన్నెల్-2లో చిక్కుకుపోయిన టిబిఎం (TBM) యంత్రాన్ని తొలగించే ప్రక్రియ కూడా వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. 1,900 మెట్రిక్ టన్నుల బరువున్న టిబిఎం యంత్రంలో ఇప్పటికే 1,300 మెట్రిక్ టన్నులను వెలికితీసినట్లు, మిగిలిన 600 మెట్రిక్ టన్నులను కూడా 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని వెల్లడించారు.
Also Read
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి, ఐదేళ్లలో టిబిఎం యంత్రాన్ని తొలగించలేకపోయారని, చుక్క నీరు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రచారం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ.450 కోట్లతో ఫీడర్ కెనాల్లో కేవలం ఆరు నెలల్లోనే 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించి, 11 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసిందన్నారు. నిర్వాసితుల పునరావాసంపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,560 కుటుంబాలకు రూ.318 కోట్లు అందజేశామని చెప్పారు. ఈ వారం మరో 2,863 కుటుంబాలకు రూ.353 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. మిగిలిన 1,898 కుటుంబాలకు ఈ నెలాఖరులోగా రూ.210 కోట్లు చెల్లించి ఆర్అండ్ఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!