CM Revanth Reddy: విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం..
- బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని బిల్లు ప్రవేశ పెట్టాం..
- బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉన్నారు..
- రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశాం.. ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.. సర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు.. 75 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోరుతూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.. బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. కలిసి కట్టుగా మనం ఉన్నామని సమాజానికి సంకేతం ఇచ్చాం.. అలాగే, గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఉపసంహరించుకున్నామని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: PM Modi: అతనే నా ఫేవరేట్ ప్లేయర్.. బెస్ట్ టీమ్ అదే
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
అయితే, లీగల్ గా ఇబ్బంది అవుతుంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి నివేదిక పంపుతున్నాం.. రిజర్వేషన్ పెంచాలని.. బలహీన వర్గాలకు అండగా ఉండాలని మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.. అందుకే ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే నిర్వహిస్తున్నాం.. చట్టబద్ధత కోసం ఇవాళ సభలో బిల్లులు ప్రవేశ పెట్టాం.. ఏ వివాదాలకు పోకుండా.. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. సభా నాయకుడిగా రిజర్వేషన్ సాధనకు నాయకత్వం వహిస్తాను.. కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.. సభకు రండి.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదాం.. చట్టాలు మనకు అనుకూలంగా రాసుకున్నవే.. 42 శాతం రిజర్వేషన్లు అమలు తీసుకొద్దామన్నారు. ప్రధాని దగ్గరికి పోదాం.. వీలైనంత తొందరగా… ప్రధానినీ అపాయింట్మెంట్ అడుగుతాం.. బీజేపీ ఎమ్మెల్యేలు, కిషన్ రెడ్డి ద్వారా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించండి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం
ఇక, రాహుల్ గాంధీని కలిసే విషయం మా పీసీసీ తీసుకుంటారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టు, జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్ ఇవ్వలేమన్నది.. అందుకే తెలంగాణలో సర్వే చేశాం.. లెక్కలు నూటికి నూరు శాతం కరక్టే.. బలహీన వర్గాలు 56.3 శాతం జనాభా ఉంది.. ఇవాళ తీర్మానం కాదు చట్టం చేశాం.. కామారెడ్డి తీర్మానానికి మేం కట్టుబడి ఉన్నాం.. బీసీలు పాలితులు కాదు… పాలకులు అవ్వాలి అని కోరారు. అందుకు మేం కృషి చేస్తున్నాం.. మాకు వచ్చిన నాలుగు ఎమ్మెల్సీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీకి అవకాశం కల్పించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?