CM Revanth Reddy: ప్రజాభవన్ లో బనకచర్ల ప్రాజెక్టు పైనా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నీళ్ళకు తెలంగాణ ప్రజలకు అనుబంధం ఉంది.. నీళ్లలో జరిగిన అన్యాయం పైనే తెలంగాణ ఉద్యమం కొనసాగింది.. నీళ్ల విషయంలో అందరిదీ ఏకాభిప్రాయమే.. తెలంగాణ హక్కులు కాపాడాలనేది మా ఆలోచన అన్నారు. అయితే, కేసీఆర్, హరీష్ రావుల దగ్గరే తొమ్మిదిన్నరేళ్ల పాటు నీటి పారుదల శాఖ ఉంది.. వాళ్ళ మీద పెట్టిన నమ్మకం వమ్ము చేశారు.. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుది బండలాగా మారింది.. నికర జలాల మీద కేటాయింపుల్లో స్పష్టత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Mrunal Thakur: మృణాల్’ను ఇంకా దాస్తారట!
ఇక, కృష్ణా నదిలో 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు చాలు అని కేసీఆర్ సంతకం చేసి వచ్చిండు అని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. అప్పుడు కూడా మేం అభ్యంతరం వ్యక్తం చేశాం.. పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు చేయాలని మేం వాదించాం.. 2020లో కూడా 299 టీఎంసీలు చాలు అని చెప్పారు.. కేసీఆర్, హరీష్ రావులు నీటి కేటాయింపులు సాధించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి చేయలేదు.. కేంద్రానికి కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ముందుకు రాలేదు.. తెలంగాణకి మరణ శాసనం రాశారు కేసీఆర్, హరీష్ రావు అని మండిపడ్డారు. అలాగే, కేసీఆర్ తన దాహం తీర్చుకోవడానికి.. కాళేశ్వరం పేరుతో అంచనాలు మార్చాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి షేప్ రావాలంటే.. ఇంకో 50 వేల కోట్లు కావాలి.. లక్ష కోట్లు ఖర్చు చేసి 50 వేల ఎకరాలకు ఇచ్చారు నీరు.. 7 వేల కోట్ల కరెంట్ బిల్లులు అయ్యాయి.. మరో 118 టీఎంసీల నీటిని సముద్రంలో కలిపారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై రిపోర్ట్ సిద్ధం.. కారణాలు తెలిసే అవకాశం..
అయితే, గోదావరిని పూర్తిగా వాడుదామంటే నీళ్ల కేటాయింపు సమస్య, నిధుల సమస్య వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ చెప్తున్న అబద్ధాలు.. మీరు జనంలోకి తీసుకెళ్లాలి అని సూచించారు. నదులు పునరుజ్జీవం కోసం కాదు.. బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. అందుకు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.. ఫామ్ హౌస్ లో ఉండి క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమాభారతి దగ్గరకి వెళ్లి 3 వేల టీఎంసీల నీళ్ళు ఉన్నాయని కేసీఆర్ అన్నాడో అప్పుడే సమస్య మొదలైంది. చంద్రబాబు మేల్కొని.. తెలంగాణనీ ఇరకటంలోకి నెట్టిండు.. చంద్రబాబు వచ్చినా.. జగన్ వచ్చినా.. గోదావరి నీళ్లు తీసుకుపోతామన్నారు.. రోజా ఇంటికి వెళ్ళి.. గోదావరి నీళ్లు ఇస్తామని కేసీఆర్ అన్నారు.. కేసీఆర్ వైఖరి.. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికి వస్తె ఏం ఇస్తావు అన్నట్టు ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.