Etela Rajender: హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వ్యవహరించినట్టే టీఆర్ఎస్ మునుగోడు విషయంలో అనుసరిస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ నెల 21న మునుగోడులో సభ పెడతామని మా పార్టీ ప్రకటించింది. అయితే, బిజెపి ప్రకటించాక కేసీఆర్ చెడగొట్టే విధంగా 20వ తేదీన సభ పెడతామని ప్రకటించారు. ఏం అవసరమొచ్చిందని కేసీఆర్ సభ పెడుతున్నారో చెప్పాలన్నారు ఈటల. ఇతర పార్టీల నాయకులకు వెలకట్టడం, ప్రలోభాలకు గురి చేడం టీఆర్ఎస్ చేస్తోందన్నారు. హుజురాబాద్ లో చేసిందే మునుగోడులో పునరావృతం చేస్తున్నారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన హుజురాబాద్ ప్రజలు గట్టి దెబ్బకొట్టారు.
కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది.. మునుగోడు ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు. ఎల్లుండి సాయంత్రం జరిగే అమిత్ షా సభకు మునుగోడు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి. టీఆర్ఎస్లో ఉంటే అవినీతిపరుడు కాదు… బీజేపీలో చేరితే అవినీతిపరుడా? మేము ఏ నాయకులతో సంప్రదింపులు జరిపితే అక్కడికి టీఆర్ఎస్ నాయకులు పోతున్నారు. వందలాది మంది సర్పంచ్, ఎంపీటీసీలు బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జెడ్పి చైర్మన్లు కూడా బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఈటల.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
Read Also: Dj Tillu 2: టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట..?
టీఆర్ఎస్ నాయకులు ఇసుక, భూ, బెల్టు షాపులు నడిపితే ఎవ్వరూ పట్టించుకోరా? బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. వేల కోట్ల రూపాయలను వాహనదారుల నుంచి దండుకుంటున్నారు. తెలంగాణ సమాజం మొత్తం అసహ్యించుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని TRS నేతలు చెబుతున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు అంత అద్భుతమైతే, ఎలాంటి నష్టం జరగకపోతే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సందర్శించడానికి వెళ్ళితే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు.
కేసీఆర్ అద్భుత సృష్టి గోదావరి పరివాహక ప్రజలను ముంచింది… మూడో టీఎంసీ కోసం కూడా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో.. మూడో టీఎంసీ ఎందుకు? డబ్భులు దండుకోవడానికే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయి. జెన్ కో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సింగరేణి దివాళా తీసింది. డిస్కం లకు చెల్లించాల్సిన సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తే ఈ పరిస్థితి రాదన్నారు. గోదావరి వరద ముంపుపై చర్చకు మేము సిద్ధం.. TRS సిద్ధమా? అని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
Read Also: lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!