Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
- సీఎం సభపై హరీష్రావు తీవ్ర విమర్శలు
- బోనస్ హామీ బోగస్ అంటూ ఆరోపణ
- యూరియా కొరతపై ప్రభుత్వంపై ఫైర్
- మంత్రి జూపల్లిపై సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహిస్తున్నది ఆశీర్వాద సభ కాదని, అది ముమ్మాటికీ రైతు వంచన సభేనని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్లలో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అడుగడుగునా రైతులను మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు పాలమూరు జిల్లా పరువు తీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను (బైట్స్) సభలో ప్రదర్శించిన హరీష్ రావు.. సీఎం అనుచిత వ్యాఖ్యల వల్ల ముఖ్యమంత్రి కుర్చీ విలువ కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు.
బోనస్.. బోగస్ అయింది.. యూరియా ఇవ్వడంలో సర్కార్ విఫలం
గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా, ప్రజలకు ఏం కావాలో ముందే గుర్తించి పనులు చేసేవారని హరీష్ రావు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి ఇచ్చిన బోనస్ హామీ అంతా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని, మార్కెట్లలో తరుగు పేరుతో నిరుపేద రైతులను దారుణంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చివరకు రైతులకు సకాలంలో యూరియా ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. షాపుల్లో అసలు యూరియా స్టాక్ ఉంచడం లేదు కాబట్టే.. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి యాప్ లంటూ కొత్త కథలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు.
Also Read
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
జిల్లా మంత్రి జూపల్లి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు
ఇదే క్రమంలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై కూడా హరీష్ రావు చమత్కరించారు. జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి అసలు ఏం మాట్లాడుతాడో, ఎందుకు మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదంటూ ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో జిల్లా మంత్రులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని, కాంగ్రెస్ మార్క్ మోసపూరిత పాలనపై రైతాంగం తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని హరీష్ రావు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!