Kaleshwaram : కాళేశ్వరం వద్ద ప్రాణహిత నదిలో వరద ఉధృతి
- మహారాష్ట్ర వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ఉధృతి
- మేడిగడ్డ బ్యారేజీ వద్ద 85 గేట్లు ఎత్తి నీటి విడుదల
- ప్రమాదకర పరిస్థితుల్లో నదిలో భక్తుల పుణ్యస్నానాలు
Kaleshwaram : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నదికి వచ్చే వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో పుష్కర ఘాట్ల వద్ద అలముకున్న తాత్కాలిక వ్యాపార స్థలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటి వరకు నీటి కొరతతో వెలిసిన నదీ తీరంలో గుడారాలు వేసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగించిన స్థానికులు, వరద ఉధృతికి అవన్నీ కోల్పోయారు.
మరోవైపు, నీటి ఉధృతి ఉన్నా కూడా భక్తులు పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగుతున్న దృశ్యాలు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో భక్తులు నదిలోకి ప్రవేశించడం పట్ల అధికారులు అప్రమత్తమవుతున్నారు. వరద ప్రవాహం పెరగడంతో నది పక్కన ఎలాంటి శాశ్వత ఏర్పాట్లు లేకపోవడం వల్ల, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిబ్బందిని మోహరించారు.
Also Read
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ShowTime Review : నవీన్ చంద్ర షో టైమ్ రివ్యూ
ఇక ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి చేరుతోంది. ప్రస్తుతానికి బ్యారేజీకి పై నుంచి సుమారు 84,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 85 గేట్లను ఎత్తి, అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో సమానంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దిగువన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వరద ఉధృతికి సంబంధించి జిల్లా పాలన యంత్రాంగం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాలపై నిఘా పెట్టి, అవసరమైతే స్థానికులను ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద స్థాయిలను గమనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భక్తులు కూడా నదిలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?