ఈటల హుజురాబాద్ రావడం తండ్రి కాళ్ళు మెక్కడం.. ప్రెస్ మిట్ పెట్టడం ఆత్మగౌరవం తో రాజీనామా చేస్తాడేమో అనుకున్నా… ఈటల రాజేందర్ ముఖంలో నిరాశ ప్రస్టేషన్ లో ఉండి వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఇన్ డైరెక్ట గా నాపై విమర్శలు చేసాడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భూములపై ఎంక్వరి వేస్తే ఆధారాలు లేక నువ్వే ఒప్పుకున్నాం. ఏ ముఖ్యమంత్రి గారి అయినా తప్పు చేసిన మంత్రి ని ఉంచరు అలానే నిన్ను భర్తరఫ్ చేశారు అని పేర్కొన్నారు. హుజురాబాద్ వెళ్లి రాజీనామా చేస్తా అన్నావు… హైదరాబాద్ వెళ్తా వాళ్ళని అడిగి రాజీనామా చేస్తా అన్నావు. హైదరాబాద్ వెళ్లి… ఒక్క బిసి నాయకుణ్ణి కలవలేదు. కాంగ్రెస్ మెట్లు ఎక్కవు బిజెపి మెట్లు ఎక్కవు. నీకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే రాజీనామా చెయ్ ప్రజాక్షేత్రంలో రుజువు చేసుకో అని తెలిపారు.
ఎందుకు అసహనం గా ఉన్నావ్… గంగుల కమలాకర్ మీద ఎందుకు పడుతున్నావ్.. నువ్వు గెలుస్తావో టీఆర్ఎస్ గెలుస్తుదో చూడు అని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గొర్రెలా ఎవరు కొనుగోలు చేసేది ఎంతమందికి డబ్బులు పంపుతున్నావ్. నీకు అంత భయం ఏంటి. కరీంనగర్ జిల్లాను బొందల గడ్డను చేశావ్ అని అన్నారు..నువ్వు ఎమ్మెల్యే కాకముందు అయ్యేక హుజురాబాద్ నియోజకవర్గములో 1985 నుండే తమిళనాడు కి చెందిన 30 గ్రానైట్ క్వారీలు నడిచాయి మరి వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావ్. క్వారీలు అపమని ఎప్పుడన్నా చెప్పవా, నువ్వు ఎందుకు మాట్లాడలేదు. అక్కడ బొందల గడ్డ గా మారుతుంటే ఎందుకు అపట్లేదు. ట్యాక్సీలు ఏగగొట్టే వ్యవహారం 2008 నుండి నడుస్తోంది. మరి ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా..350 క్వారీలు ఉంటే అందులో ఒక్క క్వారీనే గంగుల కమలాకర్ దీ. ఎంక్వరి వెపించు ట్యాక్సీ ఎంత కట్టమంటే అంత కడతా మరి నీ భూములు వెంటనే సరెండర్ చెయ్. పన్నులు ఎగ్గొడితే దానికంటే ఎక్కువ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము నీ భూములు వెంటనే ఇవ్వు. నేను బీసీ బిడ్డనే నీకు భయపడేది లేదు అని అన్నారు మంత్రి గంగుల.