KCR: అసెంబ్లీ వద్ద సందడి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు మంచిరోజు కావడంతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా శాసనసభకు వచ్చారు. కాగా..ఇదే రోజు కేసీఆర్ను బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేతగా కె.చంద్రశేఖర్ కొనసాగుతారని స్పష్టమైంది.
Read also: Vijay Thalapathy : త్వరలోనే విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ..పార్టీ పేరు పిక్స్?
Also Read
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి 39 సీట్లకే పరిమితమైంది. 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది అదే నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు ప్రమాదవశాత్తూ కేసీఆర్ తన ఫామ్హౌస్లో కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఎడమ కాలులో తుంటి ఎముక విరగడంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాన్ని కోల్పోయారు. తాజాగా ఆయన కోలుకుని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశారు. తాజాగా ఆ పార్టీ ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైక శక్తి బీఆర్ఎస్ పార్టీ అని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని కేసీఆర్ ఆదేశించారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు.
YSRCP: ఒంగోలు ఎంపీ స్థానానికి దాదాపు అభ్యర్థి పేరు ఖరారు.. ఆయనే ఫైనల్..!
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!