Etela Rajender: అమిత్ షా సభ సక్సెస్ చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా తుక్కు గూడలో రేపు జరిగే అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రేపటి బహిరంగ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కుట్రతో, కుటిల నీతితో పాలన కొనసాగిస్తున్నారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారన్నారు.
రేపు జరిగే సభను సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప ను చెల్లుమనిపిస్తాం అన్నారు. ప్రధాని అని కూడా చూడకుండా తూలనాడుతున్నారని, పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పై,బీజేపీపై తప్పుడు ప్రచారం తండ్రి కొడుకుల ప్రభుత్వం చేస్తుందని, వారు విషం కక్కుతున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ లో పెట్టినట్టుగా ఖర్చు చేయడం లేదు.
Also Read
- Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
- Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
తెలంగాణ పూర్తి గా అభివృద్ధి చేసిన ఇక దేశాన్ని ఉద్దరించాలని పగటి కలలు కంటున్నారు…పగటి కలలకు ఖర్చు ఉండదు. ఆయన కుటుంబ పాలనను ప్రజల మీద రుద్దారు. ఈ రాష్ట్రం అంతా కల్వకుంట్ల గుప్పిట్లో ఉండాలని అనుకుంటున్నారు. కల్వకుంట్ల కుటుంబమ్ పైన తీవ్ర వ్యతిరేకత.. ఆ కుటుంబాన్ని ప్రజలు చిదరించుకుంటున్నరు. ఇంటింటికి డబ్బులు పంపించిన గ్రేటర్ లో గెలవలేక పోయారు. హుజూరబాద్ లో వేల కోట్లు ఖర్చు చేసి, దుర్మార్గపు పనులు చేసిన ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. రేపటి సభను భారీఎత్తున నిర్వహిస్తున్నాం.
స్పష్టమైన సందేశం అమిత్ షా ఇవ్వబోతున్నారు. కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని అమిత్ షా పిలుపు ఇవ్వబోతున్నారు. సంజయ్ యాత్రకు భారీ స్పందన వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.TRS ప్రభుత్వం రైతులకు మేమే అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నదని, వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాం…. రైతులకు వాస్తవాలు చెప్పాం. రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం తప్పేమీ లేదన్నారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
-
Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
-
Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..