Yadadri Temple: నేటి నుంచే యాదాద్రీశుడి జయంత్యుత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి యాదాద్రిలో మూడు రోజులపాటు లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీత తెలిపారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంతోపాటు దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సంభోద్భవుడైన నరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుభఘడియాలు వచ్చేస్తున్నాయి. ఈ సంబరం నిర్వహణకు ఆచార్య బృందం.. ఆలయ యంత్రాంగం సంసిద్ధమైందని తెలిపారు.
పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో నారసింహుడి జయంత్యుత్సవాలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో మొదలవుతాయని ఈవో గీత, ప్రధాన పూజారి నల్లంథిదిగల్ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. తర్వాత స్వస్తివచనం, లక్ష కుంకుమార్చన, సాయంత్రం మృత్యంగ్రహణం, అంకురార్పణ, హవనం, తిరువెంకటపతి గరుడ వాహన సేవోత్సవం నిర్వహిస్తారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
శనివారం ఉదయం మూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయమర్దనుడు, సాయంత్రం హవనం, హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారోత్సవం జరుపుతారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మూలమంత్ర హవనం, 9 గంటల నుంచి పూర్ణాహుతి, సప ఘటా క్రం నిర్వహణ, రాత్రి నృసింహ జయంతి, నృసింహావిర్భావం పర్వాలు నిర్వహిస్తారు. ప్రధానాలయంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు స్వామి జయంతి మహోత్సవ వేడుకలు జరుగుతాయని ఈవో గీత పేర్కొన్నారు.
కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని కంచి పీఠాధిపతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వయంభూ మూర్తులను స్వామీజీ దర్శించుకున్నారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామీజీకి వస్త్రాలు, పండ్లు అందజేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో స్వామీజీ ప్రవచనం చేస్తూ…. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని ప్రశంసించారు. యాదాద్రి కొండపై అనుబంధంగా కొనసాగుతున్న పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!