Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ed Notices To Family Members Of Gangula Kamalakar

Gangula Kamalakar: గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు..? కారణం ఇదీ..!

Published Date :September 5, 2023 , 10:36 am
By NTV WebDesk
Gangula Kamalakar: గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు..? కారణం ఇదీ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబానికి చెందిన వైట్ గ్రానైట్‌లు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతేడాది నవంబర్‌లో వైట్‌ ఏజెన్సీలో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనాకు జరిగిన గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రూ. 4.8 కోట్ల ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆ డబ్బును విమానంలో బదిలీ చేసినట్లు నిర్ధారించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను రూ. 50 కోట్లు పెండింగ్.. రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించినట్లు ఇడి అధికారులు గుర్తించారు. గతంలో శ్వేతా గ్రానైట్ కంపెనీ ప్రతినిధులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్వేతా గ్రానైట్ కంపెనీ ప్రతినిధులు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి శ్వేతా గ్రానైట్ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు జారీ అయ్యాయి.

Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?

గత సంవత్సరంలో తనిఖీలు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న గ్రానైట్ కంపెనీలకు గతేడాది నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌ మంత్రి గ్రానైట్‌ వ్యాపారంపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఈడీకి ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో గంగుల మైనింగ్‌ మాఫియాను నడుపుతున్నారని ఆరోపించారు. అయినా ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మైనింగ్ మాఫియాపై బీజేపీ నేత మహీందర్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాది గంగాధర్ మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈడీ చర్యలు తీసుకుంది. గతంలో కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారుల అక్రమాలకు సంబంధించి ఎనిమిది కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరంతా మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులని.. ఆయనకు అత్యంత సన్నిహితులని చెబుతున్నారు. ఈడీ నోటీసుల తర్వాత చాలా కాలంగా సోదాలు కొనసాగుతున్నాయి.

Read also: School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు

హైదరాబాద్, కరీంనగర్‌లో మొత్తం 30 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. గ్రానైట్ వ్యవహారంపై ఆరా తీశారు. పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ మైనింగ్ కేసులో 170 కోట్ల అవినీతి జరిగింది. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను మోసం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రైల్వేలు, నౌకల్లో మైనింగ్‌ను విదేశాలకు తరలించి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది సీబీఐ అధికారులు మంత్రి ఇంటికి వెళ్లారు. గంగుల అక్కడ లేకపోవడంతో అధికారులు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సిబిఐ విచారణకు రాష్ట్రం అనుమతించనప్పటికీ తాను సిబిఐకి చెందినవాడినని శ్రీనివాస్ అనే వ్యక్తి మంత్రి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు నకిలీ సీబీఐ అధికారి అని తేలడంతో ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు గంగుల ఇంటికి వెళ్లి విచారించారు.
Mahesh Vitta: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ED
  • ed notices
  • Gangula family members
  • gangula kamalakar
  • Minister Gangula

తాజావార్తలు

  • Supritha: నా పెళ్లి కన్నా ముందు మా అమ్మకి పెళ్ళి చేస్తా

  • US-Iran: యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు.. ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • Holi 2026 : ఈసారి రంగుల పండుగ ఎప్పుడు? చంద్రగ్రహణం వల్ల తేదీల్లో మార్పులు ఇవే!

  • Roslin: దృశ్యం డైరెక్టర్ నుండి మరో థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మీనా ‘రోజలిన్’!

ట్రెండింగ్‌

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?

  • Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..

  • Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!

  • Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions