School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holidays: మూడురోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. పిల్లలు వర్షానికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల తరువాత వర్షాలు ఎక్కవ పడితే వాటి పరంగా స్కూళ్లకు సెలవు ప్రకటించాలా? లేదా అనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, బయలకు పంపవద్దని సూచించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ఉదయం పాఠశాలలు, కార్యాలయాలకు బయల్దేరిన వారి వాహనాలతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మూడురోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Read also: Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరికొద్ది గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్కో ఎండీలతో మాట్లాడారు. రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్సాగర్, ఉస్మాన్సాగర్ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేస్తున్నందున మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం, GHMC హెల్ప్లైన్ నంబర్ 040-2111 1111, డయల్ 100, EVDM కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667 ను సంప్రదించాలని సూచించారు.
Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!