School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holidays: మూడురోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. పిల్లలు వర్షానికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల తరువాత వర్షాలు ఎక్కవ పడితే వాటి పరంగా స్కూళ్లకు సెలవు ప్రకటించాలా? లేదా అనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, బయలకు పంపవద్దని సూచించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ఉదయం పాఠశాలలు, కార్యాలయాలకు బయల్దేరిన వారి వాహనాలతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మూడురోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Read also: Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
Also Read
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరికొద్ది గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్కో ఎండీలతో మాట్లాడారు. రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్సాగర్, ఉస్మాన్సాగర్ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేస్తున్నందున మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం, GHMC హెల్ప్లైన్ నంబర్ 040-2111 1111, డయల్ 100, EVDM కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667 ను సంప్రదించాలని సూచించారు.
Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!