Telangana National Integration Day.: సీఎస్, డీజీపీ సమీక్ష.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలపై కీలక ఆదేశాలు
తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు.. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు/ పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, డీజీపీ… 16వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15,000 మంది పాల్గొనేలా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ర్యాలీ తర్వాత బహిరంగ సభను నిర్వహించాలి.. ప్రతి జిల్లాకు 10,000 జాతీయ జెండాలు, 50 పెద్ద జెండాలు అందించాలని సూచించారు.. ఈ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకై సీనియర్ అధికారిని ప్రతీ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా నామినేట్ చేయాలని తెలిపారు.
Read Also: Botsa Satyanarayana: మాకు గ్యారెంటీ లేదు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ ఉంది
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
ఇక, 17వ తేదీన జాతీయ జెండాను అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు/ప్రజాప్రతినిధులచే జాతీయ జెండాను ఎగురవేయించాలని సూచించారు సీఎస్, డీజీపీ.. 17న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ముఖ్యమంత్రి జెండాను ఎగురవేయనున్నారని తెలిపారు.. ఇక, హైదరాబాద్లో కొమరం భీమ్ ఆదివాసీ భవనం మరియు సంత్ సేవాలాల్ బంజారా భవన్ను కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని.. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. గిరిజన సంఘాలకు చెందిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరిని మధ్యాహ్నం జరిగే సమావేశానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు, 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ మరియు వాణిజ్య సంస్థలను 15వ తేదీ నుండి విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఇతర అధికారులకు స్పష్టంచేశారు.
తాజావార్తలు
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
-
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
-
Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!