Telangana National Integration Day.: సీఎస్, డీజీపీ సమీక్ష.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలపై కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు.. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు/ పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, డీజీపీ… 16వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15,000 మంది పాల్గొనేలా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ర్యాలీ తర్వాత బహిరంగ సభను నిర్వహించాలి.. ప్రతి జిల్లాకు 10,000 జాతీయ జెండాలు, 50 పెద్ద జెండాలు అందించాలని సూచించారు.. ఈ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకై సీనియర్ అధికారిని ప్రతీ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా నామినేట్ చేయాలని తెలిపారు.
Read Also: Botsa Satyanarayana: మాకు గ్యారెంటీ లేదు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ ఉంది
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ఇక, 17వ తేదీన జాతీయ జెండాను అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు/ప్రజాప్రతినిధులచే జాతీయ జెండాను ఎగురవేయించాలని సూచించారు సీఎస్, డీజీపీ.. 17న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ముఖ్యమంత్రి జెండాను ఎగురవేయనున్నారని తెలిపారు.. ఇక, హైదరాబాద్లో కొమరం భీమ్ ఆదివాసీ భవనం మరియు సంత్ సేవాలాల్ బంజారా భవన్ను కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని.. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. గిరిజన సంఘాలకు చెందిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరిని మధ్యాహ్నం జరిగే సమావేశానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు, 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ మరియు వాణిజ్య సంస్థలను 15వ తేదీ నుండి విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఇతర అధికారులకు స్పష్టంచేశారు.
తాజావార్తలు
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!