Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Botsa Satyanarayana Comments About Employees Gps

Botsa Satyanarayana: మాకు గ్యారెంటీ లేదు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ ఉంది

Published Date :September 7, 2022 , 9:28 pm
By Ramesh Nalam
Botsa Satyanarayana: మాకు గ్యారెంటీ లేదు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే అంతే ఇవ్వగలమన్నారు. ప్రభుత్వం ఇంత కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు చెప్పిన ప్రతిపాదనలపై మరోసారి ఆలోచించుకోమని ఉద్యోగులకు సూచించినట్లు బొత్స తెలిపారు.

జీపీఎస్ అంశంపై మరోసారి సమావేశమై మళ్ళీ చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. దేశంలో లక్షలాది మంది రైతులకు గ్యారెంటీ ఉందా.. నాయకులం తమకు గ్యారెంటీ ఉందా.. కానీ అదృష్టవశాత్తు ఉద్యోగులకు గ్యారెంటీ ఉందని బొత్స అన్నారు. ఉద్యోగులు ఆందోళన చేస్తాం అంటే తాము ఏం చేయగలుగుతామని నిలదీశారు. ఉద్యోగులపై పెట్టిన కేసుల గురించి కూడా చర్చించామని.. గురువారం నాడు ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాలు తీసుకుని వెళతామన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధి ఉందా అని బొత్స మండిపడ్డారు. ఆయన అసెంబ్లీలో ఏమీ మాట్లాడకుండానే ఇంట్లో ఉండే మహిళల గురించి, ముఖ్యమంత్రి భార్య గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇది నీచమైన ధోరణి కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీదే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు.

Read Also: Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..

అటు సీపీఎస్ రద్దుపై చర్చించాలని మరోసారి మంత్రులను కోరామని ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు అప్పలరాజు వెల్లడించారు. జీపీఎస్ అమలుపై మాత్రమే చర్చించాలని మంత్రులు కోరారని.. అందుకే మంత్రులతో చర్చలను బహిష్కరించామన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ చేసే వరకు తాము నిరసనలు ఆపేది లేదన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ కోసమే చర్చలకు ఆహ్వానిస్తే అప్పుడే చర్చలకు వెళ్తామన్నారు. సీపీఎస్ రద్దు చేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని ఏపీసీపీఎస్‌ఈఏ ప్రధాన కార్యదర్శి పార్ధసారథి అన్నారు. సీపీఎస్ రద్దు కాకుండా ఇతర జీపీఎస్‌కు ఒప్పుకునేది లేదన్నారు. సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంతో తమకు సంబంధం లేదన్నారు. సీపీఎస్ రద్దుపై తాము చేస్తోన్న పోరాటం తమకు జీవన్మరణ సమస్య అన్నారు. తాము ఉద్యమాలు చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. సీఎం జగన్ అయితే తమకు న్యాయం జరుగుతుందని భావించామని.. 60ఏళ్ల తర్వాత తమ బతుకులు ఏమవుతాయోననే ఆందోళన తమను వెంటాడుతుందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని.. ఈ నెల 11న కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నామన్నారు. టీచర్లపై వేధింపులతో ఆందోళన పడుతోన్న దృష్ట్యా నిరసన కార్యక్రమం వాయిదా వేస్తున్నామని.. జీపీఎస్ అమలుపై ప్రభుత్వం బలవంతంగా ముందుకు వెళితే కాలమే సమాధానం చెబుతుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap employees
  • AP Government
  • botsa satyanarayana
  • CPS

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్!

  • Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’కి బాలయ్య సపోర్ట్..

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • PV Sindhu: దుబాయ్‌లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్‌పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!

  • Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?

  • NBK 111 Update: బాలయ్య సరికొత్త మేకోవర్.. ఈసారి డబిడదిబిడే!

ట్రెండింగ్‌

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions