Botsa Satyanarayana: మాకు గ్యారెంటీ లేదు.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ ఉంది
Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే అంతే ఇవ్వగలమన్నారు. ప్రభుత్వం ఇంత కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు చెప్పిన ప్రతిపాదనలపై మరోసారి ఆలోచించుకోమని ఉద్యోగులకు సూచించినట్లు బొత్స తెలిపారు.
జీపీఎస్ అంశంపై మరోసారి సమావేశమై మళ్ళీ చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. దేశంలో లక్షలాది మంది రైతులకు గ్యారెంటీ ఉందా.. నాయకులం తమకు గ్యారెంటీ ఉందా.. కానీ అదృష్టవశాత్తు ఉద్యోగులకు గ్యారెంటీ ఉందని బొత్స అన్నారు. ఉద్యోగులు ఆందోళన చేస్తాం అంటే తాము ఏం చేయగలుగుతామని నిలదీశారు. ఉద్యోగులపై పెట్టిన కేసుల గురించి కూడా చర్చించామని.. గురువారం నాడు ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాలు తీసుకుని వెళతామన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధి ఉందా అని బొత్స మండిపడ్డారు. ఆయన అసెంబ్లీలో ఏమీ మాట్లాడకుండానే ఇంట్లో ఉండే మహిళల గురించి, ముఖ్యమంత్రి భార్య గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇది నీచమైన ధోరణి కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీదే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
Read Also: Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
అటు సీపీఎస్ రద్దుపై చర్చించాలని మరోసారి మంత్రులను కోరామని ఏపీసీపీఎస్ఈఏ అధ్యక్షుడు అప్పలరాజు వెల్లడించారు. జీపీఎస్ అమలుపై మాత్రమే చర్చించాలని మంత్రులు కోరారని.. అందుకే మంత్రులతో చర్చలను బహిష్కరించామన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ చేసే వరకు తాము నిరసనలు ఆపేది లేదన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ కోసమే చర్చలకు ఆహ్వానిస్తే అప్పుడే చర్చలకు వెళ్తామన్నారు. సీపీఎస్ రద్దు చేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని ఏపీసీపీఎస్ఈఏ ప్రధాన కార్యదర్శి పార్ధసారథి అన్నారు. సీపీఎస్ రద్దు కాకుండా ఇతర జీపీఎస్కు ఒప్పుకునేది లేదన్నారు. సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంతో తమకు సంబంధం లేదన్నారు. సీపీఎస్ రద్దుపై తాము చేస్తోన్న పోరాటం తమకు జీవన్మరణ సమస్య అన్నారు. తాము ఉద్యమాలు చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. సీఎం జగన్ అయితే తమకు న్యాయం జరుగుతుందని భావించామని.. 60ఏళ్ల తర్వాత తమ బతుకులు ఏమవుతాయోననే ఆందోళన తమను వెంటాడుతుందన్నారు. సీపీఎస్ను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని.. ఈ నెల 11న కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నామన్నారు. టీచర్లపై వేధింపులతో ఆందోళన పడుతోన్న దృష్ట్యా నిరసన కార్యక్రమం వాయిదా వేస్తున్నామని.. జీపీఎస్ అమలుపై ప్రభుత్వం బలవంతంగా ముందుకు వెళితే కాలమే సమాధానం చెబుతుందన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో