CMRF Record : సీఎం సహాయ నిధి పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు
- సీఎం సహాయ నిధి పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు
- రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు 1685.79కోట్లు అందజేత
- 27,421 మందికి ఎల్వోసి కోసం 533.69 కోట్లు అందజేత
- 3,48,952 మందికి 1,152.10కోట్లు రియంబర్స్ మెంట్ అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMRF Record : తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందింది. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు మొత్తం 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల సహాయం అందజేశారు. గతంలో 2014 నుంచి 2024 వరకు సంవత్సరానికి సగటున రూ.450 కోట్లు మాత్రమే సహాయ నిధి ద్వారా పంపిణీ కాగా, ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో సగటున సంవత్సరానికి రూ.850 కోట్ల మేర నిధులు వెచ్చించడం గమనార్హం.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు రెండు విధాలుగా వైద్య సహాయం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ముందుగానే ఖర్చు భరించే లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం ద్వారా 27,421 మంది లబ్ధిదారులకు రూ.533.69 కోట్ల సహాయం అందింది. నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి వంటి వైద్య కేంద్రాల్లో ఈ సహాయం నేరుగా చికిత్స ఖర్చులకు ఉపయోగపడింది. మరోవైపు ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు ఖర్చులు చెల్లించిన అనంతరం తిరిగి పొందే రీయింబర్స్మెంట్ విధానం ద్వారా 3,48,952 మందికి రూ.1,152.10 కోట్లు అందజేశారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ICC ODI Rankings: నంబర్-1 కుర్చీ ఎవరిది? RO-KO మధ్య రేర్ క్లాష్..
ప్రజలు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం పొందేలా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా నిమ్స్లో ఎక్కువగా లెటర్ ఆఫ్ క్రెడిట్ కేసులు మంజూరవడం ద్వారా పేదలకు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియలో దళారీల పాత్ర లేకుండా దరఖాస్తులను పూర్తిగా ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. ఆధార్ ధృవీకరణ తర్వాత లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలతో చెక్కులు జారీ చేస్తుండటంతో పారదర్శకత మరింత పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర నివాసితులు, సాధారణంగా సంవత్సరానికి రూ.1.60 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్హులు. ప్రజాప్రతినిధుల సిఫారసుతో అధికారిక CMRF వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా పనిచేస్తున్న ఈ సహాయ నిధి, అనారోగ్యం కారణంగా ఆర్థికంగా కుంగిపోయే కుటుంబాలకు పెద్ద భరోసాగా మారింది. గతంతో పోలిస్తే నాలుగింతల స్థాయిలో నిధులు వెచ్చించడం ద్వారా ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం కోసం ఎంత కీలకమో ఈ గణాంకాలే స్పష్టంగా చూపిస్తున్నాయి.
Ponnam Prabhakar : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!