Ponnam Prabhakar : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం
- ఆర్టీసీలో పెరుగుతున్న ఈవీ బస్సులు
- త్వరలో మరో 2,800 బస్సులు
- 373 కొత్త రూట్లకు బస్ సేవలు
- ఆర్టీసీ ఉద్యోగులకు హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈవీ) సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుత సంఖ్య: ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 810 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఇందులో జంట నగరాల పరిధిలో 300కు పైగా బస్సులు తిరుగుతున్నాయి.
జనవరి చివరి నాటికి మరో 175 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం కింద అతి త్వరలో ఏకంగా 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ దశలవారీగా ఒకటి లేదా రెండు సంవత్సరాలలో పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
Also Read
Akhanda 2: మళ్లీ ఆందోళనలో బాలయ్య అభిమానులు.. అఖండ 2 ఉంటుందా? లేదా?
ఆర్టీసీ రవాణా వ్యవస్థను ఈవీ బస్సుల ద్వారా ముందుకు తీసుకువెళ్లి, హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను విస్తరించడంలో భాగంగా త్వరలో 373 కొత్త ప్రాంతాలకు బస్ కనెక్టివిటీని అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంటర్ సిటీ ట్రాన్స్పోర్టేషన్ కింద వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి చుట్టుపక్కల జిల్లాల నుండి హైదరాబాద్కు ఈవీ బస్సులను స్టార్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బస్సుల విస్తరణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మహాలక్ష్మి పథకం అమలు ద్వారా ఆర్టీసీ వ్యవస్థ లాభాల బాట పట్టిందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇస్తూ, వారి సమస్యలన్నీ అతి త్వరలో పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు.
Baz Drone: ప్రపంచంలోనే మొదటి ‘Sky Hunter’ డ్రోన్ – భారీ ప్రొడక్షన్కు సిద్ధమైన భారత్!
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!