CM Revanth Reddy: కరెంట్ సరఫరాకు అంతరాయం కలగొద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: డిసెంబర్ 7న తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన బ్రాండ్ పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం సీఎం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆ శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎలాంటి తేడాలు లేకుండా ఇప్పుడున్నట్లే నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. కేబినెట్ తొలి సమావేశంలో విద్యుత్ శాఖపై చర్చకు కొనసాగింపుగా శుక్రవారం (డిసెంబర్ 8) సచివాలయంలో ఆ శాఖ అధికారులతో రేవంత్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుత విధానాలనే కొనసాగించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్షలో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్పై అధికారులను సీఎం పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read also: WhatsApp New Feature: వాట్సాప్ లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ప్రస్తుతం ఆ శాఖ ఆర్థిక పరిస్థితితో పాటు రానున్న రోజుల్లో అందించాల్సిన వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలన్నది ప్రభుత్వ విధానమని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు పూర్తి సహకారం అందించాలని ఆ శాఖకు సూచించారు. ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్ రావు హాజరుకావాలని కేబినెట్ భేటీలో విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేసినా.. సమీక్షా సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు సీఎంవో నుంచి కానీ, ఆ శాఖ అధికారుల నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ సమాచారం అందితే ఎందుకు హాజరు కావడం లేదని ప్రభాకర్ రావు నిలదీశారు. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు అభ్యంతరం లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
Prabhas: ప్రమోషన్స్ చెయ్యకుండానే సలార్ వచ్చేలా ఉన్నాడు…
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!