రేపు కేసీఆర్ సభ, లక్ష మంది తరలింపుకు రంగం సిద్ధం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారం ఉధృతం చేస్తున్నాయి. గులాబీ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కేసీఆర్ పూర్తి కాన్సంట్రేషన్ తో ప్రచార సరళిని నడిపిస్తున్నాడు. నియోజకవర్గంలో ఎన్నికలు సమీపించిన తర్వాత రెండో బహిరంగ సభ రేపు సాయంత్రం హాలియా సమీపంలో నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గం అన్ని వైపులా కవర్ చేసే విధంగా ఈ సభ జరగనుంది. ఒకవైపు సభ జరగకుండా కాంగ్రెస్ బిజెపి అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ అవి ఫలించలేదు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి లక్షలాది మందితో సభ నిర్వహించడం ప్రమాదకరమైన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. అదే విధంగా శివకుమార్ అనే వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించడంతో ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అదే విధంగా యజమానులతో కూడా హైకోర్టులో పిటిషన్ వేయించేందుకు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కూడా ఈ రోజు కోర్టు కొట్టివేసింది. దీంతో అవాంతరాలు అన్ని తొలగిపోయాయి.
Also Read
కాగా ఎన్నికల సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు గ్రామం గ్రామం నుంచి కార్యకర్తలు అభిమానులు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా ఈ ప్రచారం ఈ బహిరంగ సభనో ఉపయోగించుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నించు ప్రయత్నించింది. ఇకపోతే 50 ఎకరాల్లో కేసీఆర్ ఎన్నికల సభ జరగనుంది. దీనికోసం 7 మండలాలు 2 మున్సిపాలిటీ నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు.
ఎన్నికల్లో చివరి ఘట్టం కావడంతో ఈ సభ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన నేతలు అందరూ గ్రామ గ్రామాన ప్రజలు కదిలించేందుకు చర్యలు తీసుకున్నారు. రేపు ఎన్నికల సభ ఉండగా ఎల్లుండి నుంచి ప్రచారం ముగియనుంది..ప్రచారం ముగియడానికి ముందు కేసీఆర్ సభ ఉండడం అనేది పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!