రేపు కేసీఆర్ సభ, లక్ష మంది తరలింపుకు రంగం సిద్ధం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారం ఉధృతం చేస్తున్నాయి. గులాబీ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కేసీఆర్ పూర్తి కాన్సంట్రేషన్ తో ప్రచార సరళిని నడిపిస్తున్నాడు. నియోజకవర్గంలో ఎన్నికలు సమీపించిన తర్వాత రెండో బహిరంగ సభ రేపు సాయంత్రం హాలియా సమీపంలో నిర్వహిస్తున్నారు.
నియోజకవర్గం అన్ని వైపులా కవర్ చేసే విధంగా ఈ సభ జరగనుంది. ఒకవైపు సభ జరగకుండా కాంగ్రెస్ బిజెపి అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ అవి ఫలించలేదు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి లక్షలాది మందితో సభ నిర్వహించడం ప్రమాదకరమైన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. అదే విధంగా శివకుమార్ అనే వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించడంతో ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అదే విధంగా యజమానులతో కూడా హైకోర్టులో పిటిషన్ వేయించేందుకు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కూడా ఈ రోజు కోర్టు కొట్టివేసింది. దీంతో అవాంతరాలు అన్ని తొలగిపోయాయి.
Also Read
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
- Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
కాగా ఎన్నికల సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు గ్రామం గ్రామం నుంచి కార్యకర్తలు అభిమానులు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా ఈ ప్రచారం ఈ బహిరంగ సభనో ఉపయోగించుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నించు ప్రయత్నించింది. ఇకపోతే 50 ఎకరాల్లో కేసీఆర్ ఎన్నికల సభ జరగనుంది. దీనికోసం 7 మండలాలు 2 మున్సిపాలిటీ నుంచి ప్రజలను సమీకరిస్తున్నారు.
ఎన్నికల్లో చివరి ఘట్టం కావడంతో ఈ సభ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన నేతలు అందరూ గ్రామ గ్రామాన ప్రజలు కదిలించేందుకు చర్యలు తీసుకున్నారు. రేపు ఎన్నికల సభ ఉండగా ఎల్లుండి నుంచి ప్రచారం ముగియనుంది..ప్రచారం ముగియడానికి ముందు కేసీఆర్ సభ ఉండడం అనేది పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
-
Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
-
TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
-
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!