Mahendra Nath Pandey: కేసీఆర్ స్వప్రయోజనాల కోసం పాకులాడే వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు పాకులాడే వ్యక్తి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అక్కడే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్ లేదు.. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు మహేంద్ర నాథ్ పాండే. ఇక్కడ గెలవలేని వారు జాతీయస్థాయిలో వెలుగుతారా.? అని ప్రశ్నించారు. ఆయనతో దేశం ఎలా ముందుకు వెళ్తుందని అడిగారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల్లో రాష్ట్ర ప్రజలు చేరకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకం లో కూడా అవకతవకలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వచ్చి పడుతున్నాయని అన్నారు. ప్రపంచం మొత్తం మోదీ వైపు చూస్తుందని ఆయన అన్నారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎవరినైతే నెత్తిమీద పెట్టుకున్నారో వాళ్లే మైనర్లపై అత్యాచారాలు చేస్తున్నారని విమర్శించారు. గడిచిన నెల నుంచి ఇప్పటి వరకు ఏడుగురి మైనర్లపై అత్యాచారాలు జరిగాయని..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి.. మంత్రి ప్రశాంత్ రెడ్డిలా చెక్క భజనలు చేయడం కాదని సూచించారు. మంత్రి నియోజక వర్గంలో ప్రజలు ఎక్కడి తిరగబడుతారో అని స్పెషల్ పోలీస్ ఫోర్స్ తో నియోజకవర్గంలో ప్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!