CBI Investigations: హైదరాబాద్ లో సీబీఐ సోదాలు.. పాతబస్తీలో ఆరు చోట్ల అధికారులు తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI Investigations: హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అధికారులు పలుమార్లు దాడులు చేసిన నేపథ్యంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఐటీ దాడులపై ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పాతబస్తీలోని ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. తాజాగా సదరు ఆటోమొబైల్ కంపెనీ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించి సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ అజంపురాలోని డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లో కూడా సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆమె భర్త ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, లావాదేవీల వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read also: Chain Snatchers: రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్.. గంటల వ్యవధిలోని ఆరు చోట్ల దోపిడి
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
కాగా..ఇటీవల హైదరాబాద్ లో మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటుగా, ఆయన వ్యాపార సంస్థలు, కళాశాలలపైనా ఐటి దాడులు కొనసాగాయి. ఏకంగా రెండు రోజుల పాటు జరిగిన ఐటి దాడులు తెలంగాణ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించగా.. ఐటీ అధికారులు ఆపై మంత్రి మల్లారెడ్డి తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. కాగా.. ఈ తనిఖీలలో భారీ ఎత్తున నగదును బంగారు ఆభరణాలను సీజ్ చేసిన ఐటీ అధికారులు.. లెక్కల్లో చూపించిన 20 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని కూడా సీజ్ చేశారు. అయితే ఇక అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఇళ్ళు, ఆఫీసులలో కూడా ఐటి దాడులు కొనసాగాయి. అంతేకాకుండా.. వంశీ రామ్ బిల్డర్స్ పైన కూడా ఐటీ దాడులు నిర్వహించారు.. దీంతో వరుసగా చోటుచేసుకుంటున్న ఐటీ దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. ఐటీ సోదాలు దేనికి సంబంధించి జరుగుతున్నాయి? ఎవరిని టార్గెట్ చేశారో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Narsingi Robbery Case: నార్సింగి దారి దోపిడీ కేసు.. వెలుగులోకి వస్తున్న కరణ్సింగ్ ఆగడాలు
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!