Boora Narsaiah Goud: కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్.. ఆ తప్పులన్నీ కేంద్రంపై నెట్టారు
Boora Narsaiah Goud Says CM KCR Is A Good Script Writer: తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ అని, మహబూబ్ నగర్లో ఆయన ఆరోపణల సభ పెట్టారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. తాను విస్మరించిన వాగ్ధానాలు, చేసిన తప్పులన్నింటినీ కేంద్రంపై మోపారని ఆరోపించారు. కృష్ణ నది జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పందంపై సీఎం సంతకం పెట్టిన మాట వాస్తవం కాదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దిండి ప్రాజెక్ట్కు ఎక్కడి నుండి నీళ్ళు తీసుకుంటారో డీపీఆర్లో పొందుపర్చారా? అని నిలదీశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటకు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి కూడా నీరు ఇస్తున్నట్లు చెప్పలేదని పేర్కొన్నారు.
అటు.. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చాలా వేగంగా పూర్తి చేసిందని, అందుకే సీఎం కేసీఆర్ సహకరించారని బూర నర్సయ్య పేర్కొన్నారు. ఏపీ సీఎంతో కేసీఆర్ కుమ్మక్కై.. తెలంగాణకి అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు. ‘‘కేసీఆర్.. నీకు ఆత్మ విమర్శ ఉండదా’’ అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని మోడీ ఎప్పుడైనా అన్నారా? అని నిలదీశారు. తెలంగాణలో స్కాం లేని స్కీమ్ ఉండదని.. టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ఒక్కొక్కరు వంద కోట్లకు తక్కువ ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తరహాలో మద్యంపై నిషేదం పెట్టి, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువులు, డబుల్ బెడ్రూం ఇల్లు వంటివి ఇవ్వడానికి కేంద్రం ఏనాడైనా అడ్డుపడిందా? అని బూర నర్సయ్య ప్రశ్నించారు.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
అంతకుముందు కూడా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని నర్సయ్య ఆరోపించారు. కేంద్రంలో ఉన్న సహకారం వల్లే తాను అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. అభివృద్ధి విషయంలో బీజేపీకి భేదాలు లేవని, అందరిని సమానంగా చూస్తారని తెలిపారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రాలేదంటే, అది రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లనేనని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చింది తన భవిష్యత్తు కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని వెల్లడించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని.. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!