Praja Sangrama Yatra: మూడో విడతకు ముహూర్తం.. మునుపటి కంటే భారీగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Praja Sangrama Yatra To Start From August 2: ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుందని బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. అప్పట్నుంచి 24 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రకు పూర్తి భద్రత కల్పించాల్సిందిగా తాము డీజీపీని కోరామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డపై మూడో విడత పాదయాత్ర జరుగుతుందని, ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. చేనేత దినోత్సవమైన ఆగస్టు 7వ తేదీన భూదాన్ పోచంపల్లిలో పాదయాత్ర నడుస్తుందని.. గుండ్రామ్ పల్లి, ఖిలాషాపూర్ మీదుగా ఈ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. పాదయాత్ర మధ్యలో కేంద్ర మంత్రులు సహా బిజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా రానున్నట్టు మనోహర్ రెడ్డి వెల్లడించారు.
ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మూడో విడత పాదయాత్ర జరుగుతుందన్నారు. ఆగస్టు 26న భద్రకాళి ఆలయం దర్శనం తరువాత బహిరంగ సభ నిర్వహించనున్నామని.. ఆ సభతోనే ఈ యాత్ర ముగుస్తుందని స్పష్టం చేశారు. రెండు విడతల పాదయాత్రను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు.. మూడో విడతను అంతే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూడో విడత యాత్రను గత రెండు విడతల కంటే భారీఎత్తున నిర్వహించబోతున్నామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలను ఈ పాదయాత్రలో భాగస్వామ్యం చేస్తామన్నారు. రేపు జరగనున్న పాదయాత్ర నిర్వహణ కమిటీలో బండి సంజయ్ కుమార్ సమావేశం అవుతారన్నారు. పాదయాత్ర విజయవంతం చేయాలని అరె మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించామని ప్రదీప్ కుమార్ చెప్పారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!