JP Nadda: ఒకరోజు ముందే నగరానికి నడ్డా.. బీజేపీ భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై బీజేపీ శ్రేణులు దృష్టి సాదించారు. హుజూరాబాద్ కషాయి విజయంతో.. బీజేపీ ఫోకస్ ఎక్కువైంది. నగరంలో బీజేపీ కషాయి జెండా ఎగరవేసేందుకు సిద్దమైంది. జూలై 2వ తేదీన మోదీ , షా తో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు భారీగా బీజేపీ అభిమానులు హాజరవ్వాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. సమయం దగ్గర పడుతుండటంతో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంత మయ్యాయి.
కాగా.. జూలై 2న ప్రధాని మోదీ నగరానికి రానున్న విషయం తెలిసిందే. అయితే భేటీకి సారథ్యం వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెల ఒక రోజు ముందే జూలై 1న ఉదయం హైదరాబాద్కు చేరుకోనున్నారు. అయితే.. సమావేశాలు జరిగే నోవాటెల్ వరకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యవర్గ సమావేశాల్లో ఎజెండా, చేయాల్సిన తీర్మానాలపై నిర్ణయాలు తీసుకుంటారు జేపీ నడ్డా. జులై 2న ఉదయం పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు 3వ తేదీ సాయంత్రం 5 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. అంతేకాకుండా.. 3న సాయంత్రం పరేడ్గ్రౌండ్స్లో ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించన్నారు. కాగా తుది సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్, ఇతర నేతలు శనివారం హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
కాగా.. వచ్చే నెల 2న హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీకి బస కోసం నోవాటెల్ హోటల్తో పాటు, రాజ్భవన్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని 2న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రాజ్భవన్కుగానీ, లేదా నేరుగా నోవాటెల్కు వెళ్లనున్నారు. ఆయనతోపాటు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న అమిత్షా, రాజ్నాథ్సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులకు నోవాటెల్లో భారీ భద్రతల నడుమ బస ఏర్పాట్లు చేయనున్నారు.
Agnipath protest: కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!