Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: పోక్సో (POCSO) చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృతమైన లేఖ రాశారు. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు పలు కీలక ప్రతిపాదనలను ఆయన లేఖలో పొందుపరిచారు. తెలంగాణలో జరిగిన షాబాద్ ఘటనను ఉదాహరణగా ప్రస్తావించిన పవన్, బెయిల్పై విడుదలైన నిందితుడు ఆరుగురిని హత్య చేసిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. పోక్సో కేసుల్లో నిందితుల బెయిల్ను మరింత కఠినంగా పరిశీలించాలని, బాధితులు మరియు వారి కుటుంబాలకు పటిష్టమైన భద్రత కల్పించాలని సూచించారు.
పోక్సో కేసులను దర్యాప్తు చేసే అధికారులకు తప్పనిసరిగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. బాలలతో సున్నితంగా వ్యవహరించడం, ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, కేసుల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అవసరమని పేర్కొన్నారు. బాధితుల వైద్య పరీక్షలను 24 గంటల్లో పూర్తి చేయాలని, SAFE కిట్ల వినియోగంతో పాటు DNA, FSL నివేదికలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు పవన్.. ఘటన స్థలాన్ని ఫొటోలు, వీడియోలతో తప్పనిసరిగా నమోదు చేయాలని, పోక్సో కేసుల్లో దర్యాప్తు, ఛార్జిషీట్ గడువులోగా పూర్తి కావాలని పవన్ పేర్కొన్నారు. సాధారణ కేసులను 60 రోజుల్లో, క్లిష్టమైన కేసులను 90 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ కేసులను జిల్లా ఎస్పీలు, రేంజ్ ఐజీలు ప్రతి నెల సమీక్షించాలని సూచించారు.
Also Read
ప్రతి పోక్సో కేసులో బాధితుల రక్షణ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలని, అవసరమైతే పోలీసు పహారా, ఎస్కార్ట్ సౌకర్యం కల్పించడంతో పాటు వన్స్టాప్ సెంటర్లతో అనుసంధానం చేయాలని పవన్ ప్రతిపాదించారు. బెదిరింపులకు పాల్పడే లేదా నేర చరిత్ర ఉన్న నిందితులపై రౌడీషీట్లు తెరవాలని సూచించారు. పోక్సో కేసుల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) విడుదల చేయాలని, జిల్లా, రేంజ్, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసు, ప్రాసిక్యూషన్, మహిళా-శిశు సంక్షేమ శాఖల మధ్య సంయుక్త సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కూడా సూచించారు.
పోక్సో కేసుల్లో ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయకుండా వెంటనే FIR నమోదు చేయాలని, FIR నమోదు ఆలస్యం చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, ప్రార్థనా మందిరాల్లో పిల్లలపై లైంగిక నేరాల నివారణకు తప్పనిసరి రిపోర్టింగ్ వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. పిల్లలపై లైంగిక నేరాలను సాధారణ పరిపాలనా అంశంగా కాకుండా అత్యంత ప్రాధాన్యంతో చూడాలని పవన్ స్పష్టం చేశారు. తాను సూచించిన చర్యల అమలుపై 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పోక్సో చట్టం సమర్థవంతమైన అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి వేగవంతమైన, ఖచ్చితమైన న్యాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..