Bhatti Vikramarka: భాగ్యలక్ష్మీ ఆలయం ఆయన ఒక్కడిదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భాగ్యలక్ష్మీ ఆలయంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత రషీద్ ఖాన్, చార్మినార్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతి కోసం సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు మాకు ఇష్ట దైవం అని..దేవాలయం గురించి ఎంత దూరమైనా వెళ్తామని.. మేం చార్మినార్ తొలగించాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని అన్నారు. ఓల్డ్ సిటీ డెవలప్ కాకపోవడానికి ఎవర కారణం అని..ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ ఓవైసీలు ఆస్తులు సంపాదించుకుంటున్నారని విమర్శించారు.
తాజాగా భాగ్యలక్ష్మీ దేవాలయ అంశంపై కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క స్పందించారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ బండి సంజయ్ ది ఒక్కడిదేనా..? అని ప్రశ్నించారు. అమ్మవారిని నమ్మేవారందరిదీ భాగ్యలక్ష్మీ టెంపుల్ అని అన్నారు. అమ్మవారిని నమ్మే అందరినీ బయటకు పంపి.. ఆయన ఒక్కడే గుత్తేదారి అనుకుంటున్నారని విమర్శించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఎవరో చేసిన పనికి పార్టీ బాధ్యత అవుతుందా..? అంటూ ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి కాంగ్రెస్ ఏదైనా మాట్లాడిందా..? అని అడిగారు బట్టి. జనం మీద మనువాదం రుద్దాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
Also Read
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
మరోవైపు ఈ వివాదంపై బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. జంట నగరాల్లో బీజేపీ మత చిచ్చు రగల్చాలి అని చూస్తోందని అది వారి భ్రమే అని అన్నారు. చార్మినార్ ఒక మతానికి ధర్మానికి సంబంధించింది కాదు ఇది హైదరాబాద్ ప్రజలది అని అన్నారు. నేను ఒంటరిగా చార్మినార్ వస్తా.. దమ్ముంటే రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఎక్కువ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
-
FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
-
Best Bikes: బడ్జెట్ ధరలో.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్స్..
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!