Bhatti Vikramarka: భాగ్యలక్ష్మీ ఆలయం ఆయన ఒక్కడిదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భాగ్యలక్ష్మీ ఆలయంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత రషీద్ ఖాన్, చార్మినార్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతి కోసం సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు మాకు ఇష్ట దైవం అని..దేవాలయం గురించి ఎంత దూరమైనా వెళ్తామని.. మేం చార్మినార్ తొలగించాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని అన్నారు. ఓల్డ్ సిటీ డెవలప్ కాకపోవడానికి ఎవర కారణం అని..ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ ఓవైసీలు ఆస్తులు సంపాదించుకుంటున్నారని విమర్శించారు.
తాజాగా భాగ్యలక్ష్మీ దేవాలయ అంశంపై కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క స్పందించారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ బండి సంజయ్ ది ఒక్కడిదేనా..? అని ప్రశ్నించారు. అమ్మవారిని నమ్మేవారందరిదీ భాగ్యలక్ష్మీ టెంపుల్ అని అన్నారు. అమ్మవారిని నమ్మే అందరినీ బయటకు పంపి.. ఆయన ఒక్కడే గుత్తేదారి అనుకుంటున్నారని విమర్శించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఎవరో చేసిన పనికి పార్టీ బాధ్యత అవుతుందా..? అంటూ ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి కాంగ్రెస్ ఏదైనా మాట్లాడిందా..? అని అడిగారు బట్టి. జనం మీద మనువాదం రుద్దాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
Also Read
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
మరోవైపు ఈ వివాదంపై బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. జంట నగరాల్లో బీజేపీ మత చిచ్చు రగల్చాలి అని చూస్తోందని అది వారి భ్రమే అని అన్నారు. చార్మినార్ ఒక మతానికి ధర్మానికి సంబంధించింది కాదు ఇది హైదరాబాద్ ప్రజలది అని అన్నారు. నేను ఒంటరిగా చార్మినార్ వస్తా.. దమ్ముంటే రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఎక్కువ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!