Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లిక్కర్ స్కామ్.. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అతలాకుతలం చేస్తోందన్నారు. గాంధీ టోపీలు పెట్టుకుని కేజ్రివాల్.. ఆర్టీఐ లో దరఖాస్తు పెట్టి దేశాన్ని తప్పుతోవ పట్టించారన్నారు. అవినీతిని చీపురు తో ఊడ్చేస్తాం అని చెప్పిన అలాంటి కేజ్రీవాల్…లిక్కర్ స్కామ్ లో పాల్గొనడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయనంత లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ సర్కార్ చేసిందని ఆరోపించారు. అన్నా హజారే ఎక్కడ ఉన్నారు ? హజారే సేవ.. కేజ్రీవాల్ కి ధార పోసినట్టు అయ్యిందని ప్రశ్నించారు. ఢిల్లీ లో ఇలాంటి స్కామ్ జరిగింది …హజారే బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ డిమాండ్ చేశారు. పాలసీ క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయం.. మంత్రి ఒక్కడిదే బాధ్యత కాదని గుర్తు చేశారు. సిసోడియానే కాదు.. కేజ్రీవాల్ కూడా బాద్యుడే అంటూ ఆరోపించారు. దేశానికి సమాధానం చెప్పాలని కోరారు. కవిత మీద అభియోగాలు వచ్చాయి.. సమగ్ర విచారణ కి సిద్ధం అని చెప్పాలి కానీ తెలంగాణా కు అవమానం అనడం ఏంటి ? అని ప్రశ్నించారు.
Read also: Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
తెలంగాణకి లిక్కర్ అవినీతికి సంబంధం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా? తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. అవినీతి లో ఎంత పెద్దవాళ్ళు అయినా.. దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరిని వదిలి పెట్టొద్దని సూచించారు. కవితకి నోటీసులు తెలంగాణ కి అవమానం అని అంటే… సమాజం ప్రశ్నించాలని కోరారు. ప్రతి పక్షాలను వేధిస్తోంది కేంద్రం అనేది వేరే చర్చ.. అందులో నిస్సందేహం అన్నారు. కానీ లిక్కర్ స్కామ్ కి… వేదించడానికి సంబంధం లేదు అంటూ తెలిపారు భట్టి. లేని విషయాల్లో వెంటాడితే… ఖండించాలన్నారు. సోనియా.. రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చారని, వాళ్ళు మద్యం లాంటి స్కామ్ కాదని గుర్తు చేశారు. వ్యక్తిగత దోపిడీ చేశారని అభియోగాలు ఎదుర్కోలేదన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ రక్షణ కోసం… పార్టీ బాధ్యతగా రుణం ఇచ్చింది అది తప్పు అని కేసు పెట్టారని భట్టి గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చారని, అయినా పిలవడం వేదించడమే అన్నారు. లిక్కర్ కేసుకి .. వేధింపులకు సంబంధం లేదన్నారు. కవిత లిక్కర్ స్కామ్ చేస్తే.. జనం కి ఏం సబందం అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!