Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లిక్కర్ స్కామ్.. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అతలాకుతలం చేస్తోందన్నారు. గాంధీ టోపీలు పెట్టుకుని కేజ్రివాల్.. ఆర్టీఐ లో దరఖాస్తు పెట్టి దేశాన్ని తప్పుతోవ పట్టించారన్నారు. అవినీతిని చీపురు తో ఊడ్చేస్తాం అని చెప్పిన అలాంటి కేజ్రీవాల్…లిక్కర్ స్కామ్ లో పాల్గొనడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయనంత లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ సర్కార్ చేసిందని ఆరోపించారు. అన్నా హజారే ఎక్కడ ఉన్నారు ? హజారే సేవ.. కేజ్రీవాల్ కి ధార పోసినట్టు అయ్యిందని ప్రశ్నించారు. ఢిల్లీ లో ఇలాంటి స్కామ్ జరిగింది …హజారే బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ డిమాండ్ చేశారు. పాలసీ క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయం.. మంత్రి ఒక్కడిదే బాధ్యత కాదని గుర్తు చేశారు. సిసోడియానే కాదు.. కేజ్రీవాల్ కూడా బాద్యుడే అంటూ ఆరోపించారు. దేశానికి సమాధానం చెప్పాలని కోరారు. కవిత మీద అభియోగాలు వచ్చాయి.. సమగ్ర విచారణ కి సిద్ధం అని చెప్పాలి కానీ తెలంగాణా కు అవమానం అనడం ఏంటి ? అని ప్రశ్నించారు.
Read also: Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
తెలంగాణకి లిక్కర్ అవినీతికి సంబంధం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా? తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. అవినీతి లో ఎంత పెద్దవాళ్ళు అయినా.. దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరిని వదిలి పెట్టొద్దని సూచించారు. కవితకి నోటీసులు తెలంగాణ కి అవమానం అని అంటే… సమాజం ప్రశ్నించాలని కోరారు. ప్రతి పక్షాలను వేధిస్తోంది కేంద్రం అనేది వేరే చర్చ.. అందులో నిస్సందేహం అన్నారు. కానీ లిక్కర్ స్కామ్ కి… వేదించడానికి సంబంధం లేదు అంటూ తెలిపారు భట్టి. లేని విషయాల్లో వెంటాడితే… ఖండించాలన్నారు. సోనియా.. రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చారని, వాళ్ళు మద్యం లాంటి స్కామ్ కాదని గుర్తు చేశారు. వ్యక్తిగత దోపిడీ చేశారని అభియోగాలు ఎదుర్కోలేదన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ రక్షణ కోసం… పార్టీ బాధ్యతగా రుణం ఇచ్చింది అది తప్పు అని కేసు పెట్టారని భట్టి గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చారని, అయినా పిలవడం వేదించడమే అన్నారు. లిక్కర్ కేసుకి .. వేధింపులకు సంబంధం లేదన్నారు. కవిత లిక్కర్ స్కామ్ చేస్తే.. జనం కి ఏం సబందం అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?