Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Press Meet On ED Notice To MLC Kavitha: ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈనేపథ్యంలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 11, 12 మంది మా నాయకుల మీద ఈడి, సీబీఐ, ఐటీ దాడులు కేంద్రం చేయిస్తుందని మండిపడ్డారు. కవితకు ఈడి సమన్ లు కాదు మోడీ సమన్ లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా అవినీతి పరులు అని మేము మాత్రమే నీతి వంతులము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. Lic డబ్బులు అవిరి అయ్యాయి అయినా దేశ ప్రధాని ఉలకడు పలకడు అదేంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 ఎయిర్ పోర్టులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారన్నారు. మోడీ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. మూడు వేల కోట్ల హెరాయిన్ ఆయన పోర్ట్ లో దొరికిన చర్యలు లేవు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఈడి దాడులు వంద శాతం విపక్షాల మీద నే.. ప్రతి పక్షాలు లేకుండా చేయాలి అనే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈడి దాడులు వంద శాతం విపక్షాల మీద నే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది బీఆర్ఎస్ నేతలపై ED, CBI దాడులు చేశారని, ఈడీ సమన్లు కాదు.. ఇవి మోడీ సమన్లు అంటూ నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. ఈడీ తొలుబొమ్మ , నీతి లేని పాలన.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలు అంటూ ఆరోపణలు గుప్పించారు.
Read also: Naveen murder case: కత్తిని ముందే లవర్కు చూపిన హరిహరకృష్ణ.. నవీన్ శరీరబాగాలను హసన్ ఇంట్లో..
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
రెండు వేల ఒక వంద కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్స్ దొరికినా గౌతమ్ ఆదానీ ని విచారించే ధైర్యం ఉందా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ చౌదరి, సీఎం రమేశ్ లపై కేసులు ఏమయ్యాయి ? అంటూ ప్రశ్నించారు. జీ20 కాదు. జీ 2 జీ అంటే గౌతమ్ టూ గోటబయ్ అంటూ మండిపడ్డారు మంత్రి. మోడీ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏదో జరుగుతుందంటూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అన్నారు. నీతిలేని పాలనకు కేంద్రం తీరు పర్యాయపదంగా మారింది అన్నారు. గౌతం ఆదానీ ఎవరి బినామీ అని దేశమంతా అడుగుతోంది. అదానీ మోడీ బినామీ అని చిన్న పిల్లాడు కూడా చెబుతున్నాడు. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా మోడీ, నిర్మలా ఉలకరు పలకరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి 6 పోర్టులు ఇవ్వడంపై నీతి అయోగ్ తప్పుపట్టిందని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా అదానీపై ఎలాంటి కేసులు ఉండవు. అదానీ పోర్టుల్లో హెరాయిన్ దొరికినా కేసు పెట్టరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబల్ ఇంజన్ అంటే ఒక ఇంజన్ మోడీ ఇంకో ఇంజన్ అదానీ అంటూ ఆరోపించారు. ఇక్కడ ఉన్న ఓ వ్యక్తికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ లు ఇచ్చి లోబర్చుకున్నారని మండిపడ్డారు. బీజేపీ లో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా నా? అంటూ ప్రశ్నించారు. సుజన చౌదరి కేసు, హిమంత బిస్వా శర్మ ల కేసు ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు ఏర్పాట్లు ఉండాలని పాలసీ.. అది కాదని 6 పోర్ట్ లు అదానీ కి ఇస్తే అది స్కాం అట అంటూ నిప్పలు చెరిగారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?