Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Press Meet On ED Notice To MLC Kavitha: ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈనేపథ్యంలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 11, 12 మంది మా నాయకుల మీద ఈడి, సీబీఐ, ఐటీ దాడులు కేంద్రం చేయిస్తుందని మండిపడ్డారు. కవితకు ఈడి సమన్ లు కాదు మోడీ సమన్ లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా అవినీతి పరులు అని మేము మాత్రమే నీతి వంతులము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. Lic డబ్బులు అవిరి అయ్యాయి అయినా దేశ ప్రధాని ఉలకడు పలకడు అదేంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 ఎయిర్ పోర్టులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారన్నారు. మోడీ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. మూడు వేల కోట్ల హెరాయిన్ ఆయన పోర్ట్ లో దొరికిన చర్యలు లేవు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఈడి దాడులు వంద శాతం విపక్షాల మీద నే.. ప్రతి పక్షాలు లేకుండా చేయాలి అనే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈడి దాడులు వంద శాతం విపక్షాల మీద నే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది బీఆర్ఎస్ నేతలపై ED, CBI దాడులు చేశారని, ఈడీ సమన్లు కాదు.. ఇవి మోడీ సమన్లు అంటూ నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. ఈడీ తొలుబొమ్మ , నీతి లేని పాలన.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలు అంటూ ఆరోపణలు గుప్పించారు.
Read also: Naveen murder case: కత్తిని ముందే లవర్కు చూపిన హరిహరకృష్ణ.. నవీన్ శరీరబాగాలను హసన్ ఇంట్లో..
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
రెండు వేల ఒక వంద కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్స్ దొరికినా గౌతమ్ ఆదానీ ని విచారించే ధైర్యం ఉందా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ చౌదరి, సీఎం రమేశ్ లపై కేసులు ఏమయ్యాయి ? అంటూ ప్రశ్నించారు. జీ20 కాదు. జీ 2 జీ అంటే గౌతమ్ టూ గోటబయ్ అంటూ మండిపడ్డారు మంత్రి. మోడీ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏదో జరుగుతుందంటూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అన్నారు. నీతిలేని పాలనకు కేంద్రం తీరు పర్యాయపదంగా మారింది అన్నారు. గౌతం ఆదానీ ఎవరి బినామీ అని దేశమంతా అడుగుతోంది. అదానీ మోడీ బినామీ అని చిన్న పిల్లాడు కూడా చెబుతున్నాడు. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా మోడీ, నిర్మలా ఉలకరు పలకరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి 6 పోర్టులు ఇవ్వడంపై నీతి అయోగ్ తప్పుపట్టిందని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా అదానీపై ఎలాంటి కేసులు ఉండవు. అదానీ పోర్టుల్లో హెరాయిన్ దొరికినా కేసు పెట్టరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబల్ ఇంజన్ అంటే ఒక ఇంజన్ మోడీ ఇంకో ఇంజన్ అదానీ అంటూ ఆరోపించారు. ఇక్కడ ఉన్న ఓ వ్యక్తికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ లు ఇచ్చి లోబర్చుకున్నారని మండిపడ్డారు. బీజేపీ లో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా నా? అంటూ ప్రశ్నించారు. సుజన చౌదరి కేసు, హిమంత బిస్వా శర్మ ల కేసు ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు ఏర్పాట్లు ఉండాలని పాలసీ.. అది కాదని 6 పోర్ట్ లు అదానీ కి ఇస్తే అది స్కాం అట అంటూ నిప్పలు చెరిగారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..