Bandi Sanjay: కన్నతల్లిని చంపి.. దండేసి కీర్తించే బాపతు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Sensational Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిని చంపి, దండేసి కీర్తించే బాపతు కేసీఆర్ అని ఆరోపించారు. బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను కేసీఆర్ అవమానించారని.. వాళ్లు చనిపోయాక దండేసి కీర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి నీర్వీర్యం చేస్తున్నారని.. అసెంబ్లీలో మాత్రం ఆ ఇద్దరిని ఆకాశానికెత్తేస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచ్లు సహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపణలు చేశారు. కేసీఆర్కు దమ్ముంటే.. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా? అని ప్రశ్నించారు. మొక్కలు ఎండిపోతే సర్పంచ్ను సస్పెండ్ చేస్తున్నారని, మరి నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దని అడిగారు. రామరాజ్యం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉచిత విద్య, వైద్యంతో పాటు పేదలకు ఇళ్లు, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
iPhone: ఐఫోన్ మేకర్ ఫాక్స్కాన్ భారీ పెట్టుబడి.. బెంగళూర్లో 700 మిలియన్ డాలర్లతో ఫ్లాంట్
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
అంతకుముందు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేసిన బండి సంజయ్, తప్పకుండా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకూ కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటుతో పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుంది? అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్కు సీబీఐ, పోలీసుల కంటే.. మహిళా మోర్చా అంటేనే భయమని దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని.. ఒక్కో కుటుంబంపై కేసీఆర్ రూ.6 లక్షల అప్పు మోపారని అభియోగాలు చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో మద్యం వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ చెప్పారు.
VIZAG GIS Summit Food Festival: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో నోరూరించే వంటకాలు
తాజావార్తలు
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!