iPhone: ఐఫోన్ మేకర్ ఫాక్స్కాన్ భారీ పెట్టుబడి.. బెంగళూర్లో 700 మిలియన్ డాలర్లతో ఫ్లాంట్
iPhone-Foxconn: ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక బెంగళూర్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూర్ విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల్లో ఈ ఫ్లాంట్ నిర్మించనున్నారు.
ఐఫోన్ విడిభాగాలను తయారు చేసేందుకు ఈ ఫ్లాంట్ ను నిర్మించాలని యోచిస్తున్నారు. అయితే ఈ ఫ్లాంట్ లో ఐఫోన్ హ్యాండ్ సెట్ల అసెంబ్లింగ్ ను కూడా చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఫాక్స్ కాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకుంటోంది. దీనికోసం కొన్ని భాగాలను ఉత్పత్తి చేసేందుకు ఈ ఫ్లాంట్ ను ఉపయోగించే అవకాశం ఉంది.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Anurag Thakur: రాహుల్ గాంధీ ఇక్కడ గెలవలేక.. విదేశాల్లో విమర్శలు చేస్తున్నారు..
భారతదేశంలో ఇప్పటి వరకు ఫాక్స్ కాన్ చేసిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. ఆపిల్ లో పాటు ఇతర యూఎస్ బ్రాండ్లు భారతదేశం, వియత్నాం దేశాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ మహమ్మారి సఫ్లై చైన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో పాటు చైనా వ్యాపారులపై అనుసరిస్తున్న విధానాలు, నిర్భంద లాక్ డౌన్ల వల్ల అక్కడ పారిశ్రామిక రంగం కుదేలు అయింది. దీంతోనే చైనా నుంచి పలు కంపెనీలు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నాయి.
భారత దేశంలో కొత్తగా ఏర్పాటు అయ్యే ప్లాంట్ వల్ల దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు రావచ్చని అంచనా. చైనాలోని జెంగ్ జౌలోని ఫాక్స్ కాన్ ఐఫోన్ అసెంబ్లీ ఫ్లాంట్ లో సుమారుగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్ వల్ల జెంగ్ జౌ ఫ్లాంట్ లో ఉత్పత్తి పడిపోయింది.
అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు నేతృత్వంలో ఫాక్స్ కాన్ మేనేజ్మెంట్ కు చెందిన 17 మంది సభ్యుల బృందం ఈ రోజు బెంగళూర్ విమానాశ్రయం సమీపంలోని క్యాంపస్ ను సందర్శించారు. గ్లోబల్ కంపెనీలకు బెంగళూరు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానమని, పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా ఉందని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు తెలిపారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి వెళ్లనుంది.
తాజావార్తలు
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!