Basara IIIT: బండి సంజయ్ అరెస్ట్.. బీజేపీ కార్యకర్తల ఆందోళన..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా బికనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తాను బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలపడానికి, సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. బండి సంజయ్ను పోలీసు వాహనంలో ఎక్కించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కాన్వాయి ముందు ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బికనూర్ జాతీయ రహదారి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలు రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకె ట్రిపుల్ ఐటీకి వెళుతున్నానని పోలీసులతో చెప్పినా అరెస్ట్ చేయడం ఏంటని మండి పడ్డారు. విద్యార్థుల ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లేమైన తీవ్రవాదులా అంటూ ఫైర్ అయ్యారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం సిల్లీ సమస్యలంటూ రెచ్చగొడతారా అంటూ నిలదీసారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై గవర్నర్ తమిళిసై సీఎం విద్యార్థులతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. సమస్యలు తెలుసుకోవాలని వెళితే అడ్డుకుంటారా అంటూ పోలీసుల పైన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్రిపుల్ ఐటీలో చదువుకునే వాళ్లంతా పేద విద్యార్థులే.. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పా అని నిలదీసారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడతామని స్పష్టం చేసారు. ట్రిపుల్ ఐటీ వెళ్లి తీరుతనని స్పష్టం చేసిన బండి సంజయ్ స్పష్టం చేసారు. దీంతో..పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీని పైన బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Live: Addressing the Press at Bhiknoor. https://t.co/XNaK6WUyzU
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 17, 2022
తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?