Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే ఉందని నల్లగొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఆమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కాలేశ్వరం తరువాత అత్యంత అవినీతి, స్కాం లకు కేర్ ఆఫ్ గా పౌర సరఫరా శాఖ మారిందన్నారు. పౌరసరఫరాల శాఖ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో అవినీతి, అప్పులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. గతంలో బీఆర్ఎస్, తాజాగా కాంగ్రెస్.. పౌర సరఫరాల శాఖ అక్రమాలకు, అవినీతికి వత్తాసు పలుకుతుందన్నారు. పౌర సరఫరాల శాఖ పై సమగ్ర విచారణ జరపాలన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ శాఖపై నిస్మాక్షిక విచారణ చేస్తే.. ప్రజలు పాలాభిషేకం చేస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు పెద్ద తలకాయ వచ్చిందని, అందుకే హిందూ దేవుళ్లను, రాముడిని, వారి ప్రసాదాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు
Also Read
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
హిందూ దేవుళ్లను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మతపరమైన రిజర్వేషన్లను సహించేది లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరిస్తే స్వాగతిస్తామని, అయితే ఒక వర్గానికి కొమ్ము కాస్తే మాత్రం సహించేది లేదన్నారు. మైనారిటీ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీకి 80 శాతం హిందువులందరూ గుణపాఠం చెప్పాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరితే, అసెంబ్లీలో పోరాడేందుకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అదేవిధంగా శాసనమండలిలో పోరాడేందుకు ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. హిందువులందరూ దీని గురించి ఆలోచించాలి. బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎవరికీ అవకాశం ఇవ్వదని ఆయన సెటైర్లు వేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడిని ప్రజలు రోడ్లపైకి తిప్పే పరిస్థితి లేదన్నారు. ఆరు హామీల సంగతి ఏమిటని ప్రజలు నిలదీస్తారని అన్నారు.
Canada: కెనడాలో బస్సును ఢీకొట్టిన భారతీయ సంతతి ట్రక్ డ్రైవర్.. 16 మంది మృతి
తాజావార్తలు
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
-
DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా ‘ఆధార్’ లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!