Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలో ఆహార పదార్థాల కల్తీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన మాంసాన్ని వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా.. లక్డీకపూల్లోని ద్వారకా హోటల్లో హల్వా తిని ఓ మహిళ అస్వస్థతకు గురైంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ఈనెల 23న స్రవంతి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్కాజిగిరి ప్రాంతంలోని ద్వారకా హోటల్కు వచ్చింది. హోటల్లో క్యారెట్ హల్వా తిన్న ఆమెకు డీహైడ్రేషన్, కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. అనంతరం ఫుడ్ పాయిజన్ అయిందని బాధితురాలు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి ఫుడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపినట్లు ఖైరతాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఈనెల 23న రామేశ్వరం కేపులో నిర్వహించిన తనిఖీల్లో మార్చి నెలలో గడువు ముగిసిన 100 కిలోల మినపప్పు దొరికినట్లు తెలిపారు. దీని విలువ 16 వేలు ఉంటుందని చెప్పారు. అలాగే కాలం చెల్లిన పది కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంజారా హిల్స్ , సికింద్రాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించామని తెలిపారు. ప్రజలు బయట ఫుడ్ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024.
The Rameshwaram Cafe
* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K
* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired
Above items discarded on the spot.
(1/4) pic.twitter.com/mVblmOuqZk
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?