Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలో ఆహార పదార్థాల కల్తీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన మాంసాన్ని వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా.. లక్డీకపూల్లోని ద్వారకా హోటల్లో హల్వా తిని ఓ మహిళ అస్వస్థతకు గురైంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
ఈనెల 23న స్రవంతి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్కాజిగిరి ప్రాంతంలోని ద్వారకా హోటల్కు వచ్చింది. హోటల్లో క్యారెట్ హల్వా తిన్న ఆమెకు డీహైడ్రేషన్, కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. అనంతరం ఫుడ్ పాయిజన్ అయిందని బాధితురాలు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి ఫుడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపినట్లు ఖైరతాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఈనెల 23న రామేశ్వరం కేపులో నిర్వహించిన తనిఖీల్లో మార్చి నెలలో గడువు ముగిసిన 100 కిలోల మినపప్పు దొరికినట్లు తెలిపారు. దీని విలువ 16 వేలు ఉంటుందని చెప్పారు. అలాగే కాలం చెల్లిన పది కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంజారా హిల్స్ , సికింద్రాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించామని తెలిపారు. ప్రజలు బయట ఫుడ్ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024.
The Rameshwaram Cafe
* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K
* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired
Above items discarded on the spot.
(1/4) pic.twitter.com/mVblmOuqZk
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!