Adilabad Farmers: అన్నం పెట్టే రైతన్నకు ఆదు”కొనేదెవరు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుల బాధులు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. పంటకోసం అప్పుల చేసే రైతన్నలు ఉరితాడులకు వేలాడుతున్నారు. అన్నం పెట్టే రైతే ..ఆవేదనకు గురై అప్పు తీర్చలేక..పంటను అమ్ముకోలేక, కుంటుంబాన్ని పోషించుకునే స్థోమత లేక, కన్నీటి వ్యధ చెప్పుకోలేక కడుపుకోతతో తనకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఉరితాడే మెడతాడులా వాడి ఊపిరిని బిగించుకుంటున్నారు. ఇలాంటి కన్నీటి ఘటనలే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగి ఒక్కరు ఉరేసుకొని బలవన్మరణంకు పాల్పడితే మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మడావి మారు అనే రైతు ఉరేసుకొని మృతి చెందగా.. కొమరంభీం జిల్లా కెరమెరి మండలం తుమ్మగూ డకు చెందిన రాథోడ్ మోహన్ అనే రైతు అప్పుల బాధ తో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు రైతుల ఆత్మ హత్య ఆ రెండు కుటుంబాల లో విషాదాన్ని నింపింది.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
కాగా.. ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లా 2022 మే 21న చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం పీఎన్ పాల్యం గ్రామానికి చెందిన రైతు పీవీ శ్రీరంగప్ప కు నాలుగు ఎకరాల పొలం ఉంది. పెట్టుబడులకు రూ.16 లక్షలు అప్పు చేశాడు. అప్పుతీర్చే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని నెరమెట్ల గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు సొంత పొలానికి తోడు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయం కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర ఒత్తిడికి లోనై పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కుటుంబాల్లో తీరని సోకం మిగిల్చాయి. లక్షల్లో అప్పులు, కొనలేని పంటలు, గిట్టుబాటు ధరలు లేక, రైతన్న ఆవదేనతో అప్పులు తీర్చలేక పోలంలోనే తన పెంచుకున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. అన్నం పెట్టే రైతన్నకు ఆదుకునే దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..