Adilabad Farmers: అన్నం పెట్టే రైతన్నకు ఆదు”కొనేదెవరు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుల బాధులు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. పంటకోసం అప్పుల చేసే రైతన్నలు ఉరితాడులకు వేలాడుతున్నారు. అన్నం పెట్టే రైతే ..ఆవేదనకు గురై అప్పు తీర్చలేక..పంటను అమ్ముకోలేక, కుంటుంబాన్ని పోషించుకునే స్థోమత లేక, కన్నీటి వ్యధ చెప్పుకోలేక కడుపుకోతతో తనకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఉరితాడే మెడతాడులా వాడి ఊపిరిని బిగించుకుంటున్నారు. ఇలాంటి కన్నీటి ఘటనలే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగి ఒక్కరు ఉరేసుకొని బలవన్మరణంకు పాల్పడితే మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మడావి మారు అనే రైతు ఉరేసుకొని మృతి చెందగా.. కొమరంభీం జిల్లా కెరమెరి మండలం తుమ్మగూ డకు చెందిన రాథోడ్ మోహన్ అనే రైతు అప్పుల బాధ తో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు రైతుల ఆత్మ హత్య ఆ రెండు కుటుంబాల లో విషాదాన్ని నింపింది.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
కాగా.. ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లా 2022 మే 21న చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం పీఎన్ పాల్యం గ్రామానికి చెందిన రైతు పీవీ శ్రీరంగప్ప కు నాలుగు ఎకరాల పొలం ఉంది. పెట్టుబడులకు రూ.16 లక్షలు అప్పు చేశాడు. అప్పుతీర్చే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని నెరమెట్ల గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు సొంత పొలానికి తోడు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయం కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర ఒత్తిడికి లోనై పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కుటుంబాల్లో తీరని సోకం మిగిల్చాయి. లక్షల్లో అప్పులు, కొనలేని పంటలు, గిట్టుబాటు ధరలు లేక, రైతన్న ఆవదేనతో అప్పులు తీర్చలేక పోలంలోనే తన పెంచుకున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. అన్నం పెట్టే రైతన్నకు ఆదుకునే దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!