YS Jagan: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా, జగన్ తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు. Telangana Assembly News: తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ నాయకులు తమతో సంప్రదించారని, ముందుగానే వారికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని జగన్ తెలిపారు.…
Perni Nani: వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకునే వారు.. నిజం అయితే వేలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సిందని ప్రశ్నించారు. అప్పట్లో అర్జీలు తీసుకోవటానికి విశాఖకు వెళ్లామని చెబుతున్నారు, అయితే ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం విజయవాడలో కూడా అర్జీలు తీసుకోవడం లేదని…
ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి... నాటకాల రాయుళ్లు అందరూ ఒక్కో డ్రామా వేస్తున్నారు.. అందులో ర్యాంకింగ్ ఇస్తే శ్రీధర్ రెడ్డికి నంబర్ వన్ స్థానం వస్తుందని ఎద్దేవా చేశారు.. రౌడీ గ్యాంగ్లను పెంచిపోషించింది శ్రీధర్ రెడ్డి కాదా..? అని నిలదీశారు.. పెరోల్ విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టే.. దానిని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అనుమతి ఇచ్చినా.. తెలుగుదేశం నాయకుడు పొట్టి రవిని తాడిపత్రికి రానివ్వలేదని గుర్తుచేశారు.. అయితే, పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా పెద్దారెడ్డి వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటారని పేర్కొన్నారు.. అధికారం అడ్డం పెట్టుకొని పెద్దారెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయన్న ఆయన.. మహిళలు అని చూడకుండా టీడీపీ మహిళా కౌన్సిలర్లను పరిగెత్తించి కొట్టిన ఘనత పెద్దారెడ్డిది…
Budda Rajasekhar Reddy: రెండు రోజుల క్రితం శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై జరిగిన ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలో, అటు సొంత పార్టీలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వైస్సార్సీపీ నాయకులు అబంటీ రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గం ఆయన సెటైర్లు వేశారు. శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో మద్యం…
వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో ఆధిపత్యం కోసం టీడీపీ తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది... నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలా? అని తలలు పట్టుకునే టీడీపీకి ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనడంతో అదే తలనొప్పిగా మారింది.