Off The Record: జనసేన ఎమ్మెల్యేల్లో జోష్ తగ్గిందా..? మౌనం ఎందుకు..?
- వైసీపీకి దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్న జనసేన..
- పార్టీ బలపడాల్సిన టైంలో ఎమ్మెల్యేల మౌనం ఎందుకు?..
- కౌంటర్ చేయమని పెద్దలు చెబుతున్నా స్పందనలు ఎందుకు లేవు?..
- సేనతో సేనాని మీటింగ్లో సైతం పవన్ దిశా నిర్దేశం..
- ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయమా?..
- బోర్డర్ లైన్ దాటారంటూ పెద్దలు క్లాస్ పీకుతారన్న డౌటా?..
- అసలు మాట్లాడకుంటే ఏ గొడవా ఉండదన్న అభిప్రాయం..
- కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగా టార్గెట్ చేస్తున్న వైసీపీ..
- మంత్రులు కూడా ఫీల్డ్ లెవల్లో లైట్గా ఉంటున్నారన్న అభిప్రాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి భాగస్వాములైనా… ఫీల్డ్లో ఫ్రంట్ లైన్లో కనిపించడం లేదు జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది. దీంతో అసలు అలా ఎందుకు జరుగుతోందని రాజకీయ వర్గాలు ఆరా తీయడం మొదలైపోయింది. యూరియా కొరతలాంటి రైతు సమస్యలు, ప్రజల ఇతర ఇబ్బందులు, కూటమి పార్టీల హామీల అమలు లాంటి అంశాల్లో… వైసీపీ అటాకింగ్ మోడ్లోకి వెళ్తోంది. అయినాసరే… కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న జనసేన ఎమ్మెల్యేల స్వరం మాత్రం వినిపించడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు అండగా నిలబడి, పార్టీ ఉనికిని బలంగా చాటుకోవాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కూటమి టీమ్లో బలమైన శక్తిగా ఉండి కూడా… ఎందుకు ఫ్రంట్లైన్కు రాలేకపోతున్నారన్నది బిగ్ క్వశ్చన్. అటు సీఎం, ఇటు తమ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం కౌంటర్ చేయండి, కార్నర్ చేయండని పదేపదే చెబుతున్నా…జనసేన ఎమ్మెల్యేల్లో స్పందనలు ఎందుకు రావడంలేదన్న చర్చ జరుగుతోంది.
Read Also: Chia seeds ఇలా తీసుకంటే బండి షెడ్ కు వెళ్లసిందే.. జాగ్రత్త సుమీ!
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
ఇటీవల విశాఖలో జరిగిన సేనతో సేనాని సమావేశంలో కూడా వైసీపీ వ్యవహార శైలి ప్రస్తావనకు వచ్చిందట. ప్రతిక్షాన్ని గట్టిగా కౌంటర్ చేయాలని అప్పుడు జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో పవన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. విడిగా జనసేనతోపాటు కూటమి ఐక్యత, పరిపాలన విషయంలో.. వైసీపీ సోషల్ మీడియాలోతప్పుడు ప్రచారం చేస్తోందని, దాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని చెప్పారట పవన్. అయితే… అప్పుడు శ్రద్ధగా విన్న నాయకులు తర్వాత మాత్రం మనకెందుకులే అన్నట్టుగా ఉన్నారన్నది జనసేన వర్గాల మాట. ఏం మాట్లాడితే ఎలాంటి తంటాలు వస్తాయోనన్నది వాళ్ళందరి భయంగా తెలుస్తోంది. ఆ భయం వైసీపీ విషయంలో కాదని, కూటమి పెద్దల గురించేనని చెప్పుకుంటున్నారు. ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ అన్నట్టుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో… చిన్న తేడా జగిరినా… బోర్డర్ లైన్ ఎందుకు క్రాస్ అయ్యావంటూ పార్టీ పెద్దలు పిలిచి చివాట్లు పెడతారు. దానికంటే మనం గమ్మున ఉండటం మంచిదికదా అన్న అభిప్రాయంతో ఉన్నారట ఎక్కువ మంది జనసేన శాసనసభ్యులు. తమ నియోజకవర్గాల్లో వైసీపీ ఫుల్ స్పీడ్గా రోడ్డు ఎక్కుతున్నా…చూస్తూ ఉండటం తప్ప యాక్టివ్ మోడ్లోకి ఎమ్మెల్యేలు రాలేకపోతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Asia Cup 2025: పాకిస్థాన్పై విజయం పక్కా.. భారత్ అదృష్టం దుబాయ్ చేరుకుంది!
2024లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన… దాన్ని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నా…గ్రౌండ్ లెవల్లో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు. అదే వైసీపీకి బలంగా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది జనసేన వర్గాల్లో. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో గట్టి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ… అక్కడి ఎమ్మెల్యేలను కార్నర్ చేస్తోంది. కానీ… వాళ్ళు మాత్రం కౌంటర్ చేసుకునే ప్రయత్నాల్లో లేరని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. జనసేన తరుపున పార్టీ అధినేత పవన్ తప్ప మరో నాయకుడు నోరు మెదపడం లేదు. 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు,ఇద్దరు మంత్రులు ఉన్నారు. చివరికి పార్టీకి చెందిన మంత్రులు కూడా డిపార్ట్మెంటల్ ఇష్యూస్ కే పరిమితం అవుతున్నారు తప్ప… ఫీల్డ్ లెవెల్ లో వైసీపీని స్ట్రాంగ్ కౌంటర్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం జనసేన వర్గాల్లోనే ఉందట. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాల గురించి అయితే.. ఇక మాట్లాడుకోవాల్సిన పనేలేదు. మొత్తం మీద కీలకంగా ఉండాల్సిన జనసేన ఎమ్మెల్యేలు రకరకాల పరిమితుల కారణంతో నోరు మెదపకపోతే…. అంతిమంగా పార్టీకే నష్టం జరుగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది.
తాజావార్తలు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!