Off The Record: సిక్కోలు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే..!!
- సమన్వయంలో చతికిలపడుతున్న సిక్కోలు వైసీపీ సీనియర్స్..
- ఇగోలతో మరింత బలహీనపరుస్తున్నారన్న అభిప్రాయం..
- పుంజుకునే పరిస్థితి కనిపించడంలేదని ద్వితీయ శ్రేణి ఆవేదన..
- దాదాపు ప్రతి చోట ఎటు చూసినా గ్రూపుల గోలే..
- గతంలో పదవులు వెలగబెట్టిన వారు సైతం కార్యక్రమాలకు దూరం..
- ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్కు టచ్లో టెక్కలి ద్వితీయ శ్రేణి..
- ఆమదాలవలసలో కొత్త ఇన్ఛార్జ్కు సహకరించని తమ్మినేని వర్గం..
- ఎక్కడికక్కడ తన్నుకోవడాలు, తలంట్లతో టైంపాస్..
- బడా నేతలే పరిస్థితిని దిగజారుస్తున్నారన్న ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: రాష్ట్రం మెత్తం ఒక లెక్క, మా జిల్లా తీరు మరో లెక్క అంటున్నారు సిక్కోలు వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్. ఇక్కడ పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ బేస్ ఉంది. కానీ… సమన్వయం చేసుకోవడంలోనే చతికిలపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే…ఇప్పుడప్పుడే కోలుకునే ఛాన్స్ కూడా ఉండబోదని పార్టీ వర్గాలో అంటున్నాయి. ఒకటి రెండు నియెజకవర్గాలు మినహా… ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్నిచోట్ల గ్రూప్స్ గోల ఉంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నా… నేతల తీరు మాత్రం మారడం లేదంటోంది కేడర్. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా అంటూ… ఇగోలకు పోతూ మరింత బలహీనపరుస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు. జిల్లాలోని అధికార కూటమి పార్టీలు మధ్య కొన్ని లొసుగులు ఉన్నా… అంతా ఒకే దారిలో వెళ్తున్నారని, మరి.. మనోళ్ళకు ఏమైందంటూ మధనపడుతున్నారట ఫ్యాన్ లీడర్స్. వర్గ విభేదాలు, నియెజకవర్గ స్దాయిలో ఉన్న గ్రూపులు పార్టీని మరింత బలహీన పరుస్తున్నాయన్న ఆందోళ వ్యక్తం అవుతోంది. ఎలాగూ… కేడర్ బేస్ ఉంది కాబట్టి.. అధిష్టానం ఇచ్చిన పిలుపును అందుకుని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగితే… పూర్వపు స్థితి వస్తుందని, కానీ… ప్రస్తుతం చూస్తుంటే అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదని చెబుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు.
ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాలవలస, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, పలాస, పాతపట్నం…. ఇలా ఎటు చూసినా గ్రూపుల గోలే. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విభేదాలున్నాయని, కాకుంటే… చిన్నగీతకు, పెద్ద గీతకు మధ్య ఉండే అంతరం తప్ప..గొప్పగా ఏం లేదని చెబుతున్నారు వైసీపీ లీడర్స్. అసలు వీటన్నిటికీ కారణం పార్టీ సీనియర్స్ వైఖరేనన్నది ద్వితీయ శ్రేణి మాట. ఇచ్చాపురంలో ఇన్ఛార్జ్ పిరియా విజయలక్ష్మి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారట విజయలక్ష్మి. కానీ… నియెజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు వెలగబెట్టిన వారు మాత్రం కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నట్టు సమాచారం. గతంలో యాక్టివ్గా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సైతం మున్సిపల్ ఛైర్పర్సన్ విషయంలో తేడాగా ఉన్నట్టు తెలుస్తోంది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినా… వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికీ ఆయనతో టచ్ లోనే ఉన్నారట. ఆమదాల వలసలో కొత్త ఇంచార్జ్ చింతాడ రవికుమార్కు మాజీ స్పీకర్ తమ్మినేని వర్గం సహకరించడం లేదంటున్నారు. ఎచ్చెర్లలో మాజీ ఎమ్మెల్యే సైతం పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ తో సతమతం అవుతున్నారట. రాజాంలో కొత్త ఇంచార్జ్ డాక్టర్ తలేరాజేష్, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు వర్గాల మధ్య అంతే స్దాయిలో కోల్డ్ వార్ ఉందంటున్నారు.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఇలా… ఏ నియెజకవర్గాన్ని చూసినా… ఎక్కడికక్కడ తన్నుకోవడాలు, తలంట్లు పోసుకోవడాలు తప్ప… కష్టాల్లో ఉన్న పార్టీని కలిసి నడిపిద్దామన్న స్పృహ ఒక్కరికీ ఉండటం లేదన్నది లోకల్ పార్టీ వాయిస్. ఇంకా మాట్లాడుకుంటే… ఇక్కడ టిడిపి బలం కంటే వైసిపి బలహీనతే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. సమస్యలు పరిష్కరించి…ముందుకు తీసుకువెల్లాల్సిన జిల్లాకు చెందిన బడానేతలు… నియెజకవర్గాల్లోని గ్రూపులను తమ ఆధిపత్యం కోసం వాడుకుంటూ పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. బడా నేతల తీరులో మార్పు రాకుంటే భవిష్యత్లో సిక్కోలు వైసీపీకి సమస్యలు తప్పవన్నది ద్వితీయ శ్రేణి మాట.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!