Home
Ycp
Ycp News
-
YS Jagan: సమయం వచ్చింది.. జిల్లాల్లోనే నిద్ర చేస్తా: వైఎస్ జగన్
ఆరు నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత వచ్చిందని, ఇక ఇక ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుందని, ప్రతి పార్లమెంటులో బుధ, గురువారాల్లో తాను నిద్ర చేస్తాను అని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నానని, వైసీపీ పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చన్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో 50 శాతం… -
Sajjala Bhargava Reddy: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవరెడ్డికి ఎదురుదెబ్బ!
వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భార్గవరెడ్డి పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విజ్ఞప్తులను ఏపీ హైకోర్టు ముందే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సజ్జల భార్గవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్ చెప్పగా.. చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై… -
Perni Nani: కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలపై పేర్ని నాని సెటైర్లు!
కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పటం ఏంటన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం షిప్లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అని, ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలని, లేకపోతే… -
Botsa Satyanarayana: విద్యుత్ చార్జీలు పెంచడంపై ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేస్తున్నారు!
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే.. ఆవు కథలాగా మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారన్నారు. ఒక్కో యూనిట్కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 70 వేల కోట్లు అప్పు చేసిందని, దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని… -
Amzath Basha: నిధులు లేవంటూ.. నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు!
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా అన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. నిధులు లేవంటూ మాజీ సీఎం వైస్ జగన్ గారిపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆంజాద్ బాషా ఫైర్… -
Anantha Venkatarami Reddy: తాడిపత్రి ఎవరి జాగీరు కాదు.. మేం అక్కడే మీటింగ్ పెడతాం!
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి ఎవరి జాగీరు కాదని, వైసీపీ పార్టీ నాయకులంతా వస్తారన్నారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడను అని చెప్పారు. తాను అవినీతి చేసుంటే.. విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తాడిపత్రిలోనే కాదు అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం అని వెంకటరామిరెడ్డి చెప్పుకొచ్చారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… ‘నా తల్లిదండ్రులు నన్ను సంస్కారంతో పెంచారు. నాలుగు సార్లు ఎంపీగా,… -
Bala Veeranjaneya Swamy: తప్పు చేసినవాళ్లు ఎవరైనా తప్పించుకోలేరు: మంత్రి డోలా
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు. Also Read: CM… -
CBN Convoy Attack Case: చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో కీలక అప్డెట్..
ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్పై కేసు నమోదు అయ్యే ఛాన్స్తో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ… -
Chevireddy Bhaskar Reddy: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు..
మాజీమంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందా అని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సిఎం అయినా తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ల మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు. -
Midhun Reddy: పోలవరం అంశంపై పార్లమెంట్లో చర్చించాలి..
వైసీపీ తరఫున అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోకసభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు.. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయన్నారు.
తాజావార్తలు
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
-
IPL 2026 Players: ఐపీఎల్ ప్లేయర్స్ ఫిట్నెస్.. ఫ్రాంచైజీల బాధ్యతపై చర్చ..
-
Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
-
Husband Murder: ఖతర్నాక్ వైఫ్.. భర్తపై 3 కోట్ల బీమా చేసి కన్నింగ్ స్కెచ్.. చివరికిలా!
-
Loans: లోన్లు ఇవ్వడంలో పురుషుల కంటే మహిళలకే బ్యాంకుల ప్రాధాన్యం..! ఎందుకిలా జరుగుతోంది?
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!