YS Jagan: మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?
- చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం కుదేలు అయ్యో పరిస్థితి ఏర్పడింది..
- మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?
- చంద్రబాబు మోసాలపై మా పార్టీ నేతలు.. కార్యకర్తలు ట్వీట్ చేస్తారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం కుదేలు అయ్యో పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి 19.54 శాతం అప్పులు చేశారు.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 15.61 శాతం అప్పులు చేశామన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ను బాగా నడిపిన వైసీపీకి అవార్డు ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పు రత్న ఎవరికి ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. రెండేళ్లు కోవిడ్ ఉన్నా చంద్రబాబు కంటే మంచి పరిపాలన ఇచ్చాం.. జీడీపీలో రాష్ట్రం నుంచి టీడీపీ హయం కంటే వైసీపీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిందన్నారు. ఉద్యోగాల సృష్టిలో Phd చేసినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు.. రాష్ట్రంలో అంబానీలు, అదానీలు, ఆదిత్య మిట్టల్, బిర్లా లాంటి పారిశ్రామిక వేత్తలు వైసీపీ సమయంలో నే అనేక ఏంఓయూలు చేసుకున్నారు.. జిందాల్ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే ఇబ్బంది పెట్టు పంపిస్తున్నారు అని జగన్ ఆరోపించారు.
Read Also: New Study: ‘‘జ్ఞాపకాలు మెదడుకు మాత్రమే పరిమితం కావు’’.. శరీరంలో ఇతర భాగాల్లో మెమోరీ ఫంక్షన్స్..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
అలాగే, రాష్ట్ర బడ్జెట్ ను చూస్తే మోసం అబద్ధం కనిపిస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి.. 170కి పైగా హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇస్తారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదన్నారు. మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..? అని అడిగారు. చంద్రబాబు మోసాలపై నేను ట్వీట్ చేస్తాను.. మీరంతా ట్వీట్ చేయండి అని పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసాలపై నాతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ట్వీట్ చేస్తారన్నారు. ఎంతమందిపై కేసులుపెడతారో పెట్టండి.. అసెంబ్లీ జరిగినంత కాలం మా ఎమ్మె్ల్యేలు మీడియా ముందు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!