YS Jagan: మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?
- చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం కుదేలు అయ్యో పరిస్థితి ఏర్పడింది..
- మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?
- చంద్రబాబు మోసాలపై మా పార్టీ నేతలు.. కార్యకర్తలు ట్వీట్ చేస్తారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం కుదేలు అయ్యో పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి 19.54 శాతం అప్పులు చేశారు.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 15.61 శాతం అప్పులు చేశామన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ను బాగా నడిపిన వైసీపీకి అవార్డు ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పు రత్న ఎవరికి ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. రెండేళ్లు కోవిడ్ ఉన్నా చంద్రబాబు కంటే మంచి పరిపాలన ఇచ్చాం.. జీడీపీలో రాష్ట్రం నుంచి టీడీపీ హయం కంటే వైసీపీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిందన్నారు. ఉద్యోగాల సృష్టిలో Phd చేసినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు.. రాష్ట్రంలో అంబానీలు, అదానీలు, ఆదిత్య మిట్టల్, బిర్లా లాంటి పారిశ్రామిక వేత్తలు వైసీపీ సమయంలో నే అనేక ఏంఓయూలు చేసుకున్నారు.. జిందాల్ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే ఇబ్బంది పెట్టు పంపిస్తున్నారు అని జగన్ ఆరోపించారు.
Read Also: New Study: ‘‘జ్ఞాపకాలు మెదడుకు మాత్రమే పరిమితం కావు’’.. శరీరంలో ఇతర భాగాల్లో మెమోరీ ఫంక్షన్స్..
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అలాగే, రాష్ట్ర బడ్జెట్ ను చూస్తే మోసం అబద్ధం కనిపిస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి.. 170కి పైగా హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇస్తారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదన్నారు. మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..? అని అడిగారు. చంద్రబాబు మోసాలపై నేను ట్వీట్ చేస్తాను.. మీరంతా ట్వీట్ చేయండి అని పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసాలపై నాతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ట్వీట్ చేస్తారన్నారు. ఎంతమందిపై కేసులుపెడతారో పెట్టండి.. అసెంబ్లీ జరిగినంత కాలం మా ఎమ్మె్ల్యేలు మీడియా ముందు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!