Minister Anagani: 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు.. ఎంతటి వారున్నా శిక్షిస్తాం: మంత్రి అనగాని
- భూ కబ్జాలపై 8305 ఫిర్యాదులు
- ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం
- ఎంతటి వారున్నా శిక్షిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం అని మంత్రి అనగాని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి 8,305 ఫిర్యాదులు వచ్చాయి. 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్దారించాం. కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో 13 లక్షల 59వేల 505 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు. 25 వేల 276 ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించాం. వీటిలో నిబంధనలకు విరుద్దంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్దారించాం. ఇప్పటి వరకు రెవెన్యూ సంబంధించి 70 వేల ఫిర్యాదులు రాగా.. 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే ఉన్నాయి’ అని మంత్రి అనగాని తెలిపారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Also Read: Nara Lokesh: అప్పటి లోగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం: మంత్రి లోకేశ్
‘భూ కబ్జాల నివారణకోసం నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని తీసుకువస్తున్నాం. భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకువస్తున్నాం. భూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా, పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే కొత్త చట్టం తెస్తున్నాం. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారు, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయి. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం’ అని మంత్రి అనగాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..