Minister Anagani: 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు.. ఎంతటి వారున్నా శిక్షిస్తాం: మంత్రి అనగాని
- భూ కబ్జాలపై 8305 ఫిర్యాదులు
- ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం
- ఎంతటి వారున్నా శిక్షిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం అని మంత్రి అనగాని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి 8,305 ఫిర్యాదులు వచ్చాయి. 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్దారించాం. కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో 13 లక్షల 59వేల 505 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు. 25 వేల 276 ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించాం. వీటిలో నిబంధనలకు విరుద్దంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్దారించాం. ఇప్పటి వరకు రెవెన్యూ సంబంధించి 70 వేల ఫిర్యాదులు రాగా.. 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే ఉన్నాయి’ అని మంత్రి అనగాని తెలిపారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Also Read: Nara Lokesh: అప్పటి లోగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం: మంత్రి లోకేశ్
‘భూ కబ్జాల నివారణకోసం నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని తీసుకువస్తున్నాం. భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకువస్తున్నాం. భూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా, పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే కొత్త చట్టం తెస్తున్నాం. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారు, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయి. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం’ అని మంత్రి అనగాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!