Minister Anagani: 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు.. ఎంతటి వారున్నా శిక్షిస్తాం: మంత్రి అనగాని
- భూ కబ్జాలపై 8305 ఫిర్యాదులు
- ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం
- ఎంతటి వారున్నా శిక్షిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం అని మంత్రి అనగాని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి 8,305 ఫిర్యాదులు వచ్చాయి. 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్దారించాం. కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో 13 లక్షల 59వేల 505 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు. 25 వేల 276 ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించాం. వీటిలో నిబంధనలకు విరుద్దంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్దారించాం. ఇప్పటి వరకు రెవెన్యూ సంబంధించి 70 వేల ఫిర్యాదులు రాగా.. 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే ఉన్నాయి’ అని మంత్రి అనగాని తెలిపారు.
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
Also Read: Nara Lokesh: అప్పటి లోగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం: మంత్రి లోకేశ్
‘భూ కబ్జాల నివారణకోసం నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని తీసుకువస్తున్నాం. భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకువస్తున్నాం. భూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా, పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే కొత్త చట్టం తెస్తున్నాం. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారు, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయి. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం’ అని మంత్రి అనగాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!