Nara Lokesh: అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. మండలిలో లోకేష్ ఫైర్
- అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు..
- వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదు..
- నా తల్లిని అవమానించిన తర్వాతనే.. చంద్రబాబు సభకు రాలేదు: మంత్రి లోకేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అవమానకర రీతిలో మాట్లాడిన నాయకులను తమ పార్టీ సమర్ధించడం లేదనీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. సమర్ధించకపోతే అవమానకర రీతిలో మాట్లాడిన వాళ్లకు, టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. సభ బడ్జెట్ పై చర్చ జరపాలి కానీ.. ఇతర కార్యక్రమాలతో సభ సమయాన్ని వృథా చేయవద్దని చైర్మన్ మోషేను రాజు సూచించారు.
Read Also:AUS vs IND: సచిన్ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!
Also Read
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
కాగా, అంతకు ముందు.. మండలిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయరని విమర్శించారు. అయితే, తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలాపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారని పేర్కొన్నారు. నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి ఛాలెంజ్చేసి వెళ్లిపోయరని గుర్తు చేశారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని మంత్రి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్బాల్ క్లబ్ అమ్మకం..
-
BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్కు ఇరాన్ అధ్యక్షుడు..
-
BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో సమాధానం..
-
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
-
Asim Munir: అసిమ్ మునీర్కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!