Nara Lokesh: అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. మండలిలో లోకేష్ ఫైర్
- అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు..
- వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదు..
- నా తల్లిని అవమానించిన తర్వాతనే.. చంద్రబాబు సభకు రాలేదు: మంత్రి లోకేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అవమానకర రీతిలో మాట్లాడిన నాయకులను తమ పార్టీ సమర్ధించడం లేదనీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. సమర్ధించకపోతే అవమానకర రీతిలో మాట్లాడిన వాళ్లకు, టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. సభ బడ్జెట్ పై చర్చ జరపాలి కానీ.. ఇతర కార్యక్రమాలతో సభ సమయాన్ని వృథా చేయవద్దని చైర్మన్ మోషేను రాజు సూచించారు.
Read Also:AUS vs IND: సచిన్ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!
Also Read
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
కాగా, అంతకు ముందు.. మండలిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయరని విమర్శించారు. అయితే, తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలాపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారని పేర్కొన్నారు. నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి ఛాలెంజ్చేసి వెళ్లిపోయరని గుర్తు చేశారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని మంత్రి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
-
Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
-
Balakrishna :”ఆనాడు అమ్మ అడిగిన ప్రశ్న వల్లే ఇది సాధ్యమైంది..”\
-
Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
-
Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే ‘క్షమాపణ’.. గేటు దాటకపోతే ‘బలిపశువా’..?
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!