ఢిల్లీ : బుగ్గన రాజేంద్ర నాథ్ ఆర్థిక మంత్రిగా కన్నా అప్పుల మంత్రిగా బాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు జివిఎల్ నరసింహారావు. ఏపీ అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిందని దేశం మొత్తానికి తెలిసిందని…కొత్త అప్పుల కోసం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు జివిఎల్ నరసింహారావు. ఓటు బ్యాంకు కోసం, పథకాల కోసం రుణాలు చేస్తున్నారని… ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. పెన్షన్లు..జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని.. అప్పుల పై చూపించే…
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట. ఇంకొకరు మధ్యలో దూరకుండా వారసులను లైన్లో పెట్టేందుకు ముందుగానే కర్చీఫ్ వేస్తున్నారు. అదను చూసి పావులు కదుపుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. కుమారులను ప్రోత్సహిస్తోన్న ఎమ్మెల్యేలు! కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల కంటే వారి వారసులు రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.…
గోదావరి జిల్లా వాసులు సంతోషం వస్తే పట్టలేరు. తేడా వచ్చిందో గోదారి యాసలోనే ఏకి పడేస్తారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు రెండో కేటగిరీలోకి చేరారట. ఎమ్మెల్యేగా అందరివాడుగా ఉన్న ఆయన మంత్రి అయ్యాక కొందరివాడుగా మారారని ఒకటే కామెంట్స్. ఎమ్మెల్యే అంటే ఆయనలా ఉండాలన్న వారు.. ఇప్పుడు మాకొద్దు బాబోయ్ అని దూరం జరుగుతున్నారట. ఎందుకలా? ఆయనలో వచ్చిన మార్పులేంటి? ఎవరా మంత్రి? లెట్స్ వాచ్! ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్మార్నింగ్ అని పర్యటించేవారు!…
మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏవో సంచలన పరిణామాలు వచ్చినట్టు, కొత్తమలుపులు తిరుగుతున్నట్టు కథనాలు మార్మోగుతున్నాయి. ఆయన వాచ్మ్యాన్ రంగయ్య సిబిఐ దర్యాప్తు తర్వాత మేజిస్ట్రీట్ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మూడుపేర్లు చెప్పడం ఇందుకు కారణమవుతున్నది. తర్వాత ఆయన మీడియాతోనూ మాట్లాడారు. ఆయన చెప్పిన పేర్లలో ప్రధానంగా వినిపిస్తున్న ఎర్రగంగిరెడ్డి తనకు హత్యతో సంబంధం లేదని అంటుండగా మరోపేరు సునీల్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు ఈ హడావుడి మొదలవడానికి ముందు హత్యకేసు దర్యాప్తు…
నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు కర్నూలు వైసీపీ సీనియర్లు. ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు ఇక తిరుగే ఉండదు అనుకున్న నేతలకు తాజా పదవుల పంపకాల్లో నిరాశే మిగిలింది. స్థానికంగా సీనియర్లు అనిపించుకున్న నేతలనూ హైకమాండ్ పక్కన పెట్టేయడం ఏ లెక్కలోనో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా పదవుల్లేవ్! కర్నూలు జిల్లాలో వైసీపీ సీనియర్లు.. నాయకులకు కొదవ లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డితో సాన్నిహిత్యం ఉండి.. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్నాయుడు.. విశాఖ…
రెండేళ్లుగా గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కొట్టిన ఆ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఎంపీతో ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారా? ఎంపీ వస్తున్నారని తెలిస్తే.. వేరే పని ఉందని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారా? ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏ విషయంలో బెడిసికొట్టింది. ఎవరు వారు? కేడర్తో ఎమ్మెల్యే కిరణ్కు దూరం వచ్చిందా? శ్రీకాకుళం ముఖ ద్వారం ఎచ్చెర్ల పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్గా ఉంటాయి. నేను లోకల్ అంటూ గత ఎన్నికల్లో బరిలో దిగిన గొర్ల…
వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని బరిలో దించాలన్నది ఆ ఎంపీ ఆలోచన. ఇందుకోసం ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బుసలు కొడుతున్నారట. ఇది కాస్తా గుప్పుమనడంతో రెండువర్గాల మధ్య వార్ ఓ రేంజ్లోకి చేరుకుంది. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ! రాజకీయాల్లో తండ్రి కీలక స్థానంలో ఉంటే.. తనయులు ఆయన్ని అనుసరించడం కామన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా పాలిటిక్స్లో…
పేకాట పేకాటే.. అనుచరులు అనుచరులే. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ, పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఓ ఘటన ఏకంగా ఖాకీలకు చుక్కలు చూపించిందట. నేతల ఒత్తిళ్లు తట్టుకోలేని పోలీసులు పేకాట ఆడుతూ దొరికిన వాళ్లను వేరే జిల్లాలో వదిలేయాల్సి వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రూటు మార్చిన పేకాట మాఫియా! గుంటూరు జిల్లా పేకాటకు హబ్గా మారింది. జిల్లాలో కొంతమంది అధికారపార్టీకి చెందిన నేతలు పేకాట ఆడిస్తున్నారని ఓపెన్గానే చెబుతున్నారు.…
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు. ఏదో ఆశిస్తే.. ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు. మెడలో కండువా ఉన్నా.. చేతిలో పదవి లేక తెగ మథన పడుతున్నారట. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారా .. లేరా? వైసీపీ ఆవిర్భావం…