తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కొండపల్లి మైనింగ్ పై తెదేపా నేత పట్టాభి ఆరోపణలను ఖండించిన ఆయన.. అబద్దాలను నిజం చేయాలని తెదేపా నేతలు, పట్టాభి ప్రయత్నాలు చేస్తున్నారని.. లోయ గ్రామంలో లేని 143 సర్వే నెంబర్ ను వైఎస్ హయాంలో సృష్టించారని పట్టాభి ఆరోపించారని.. 1993లో ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్ పై లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారని.. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉంది..143 సర్వే నెంబర్ ఎప్పట్నుంచో ఉందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు.
వైఎస్ హయాంలో 143 సర్వే నెంబర్ ను సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు వసంత కృష్ణప్రసాద్.. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతోంది… అక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు.. నా పై బురదజల్లడమే లక్ష్యంగా దేవినేని ఉమా.. ఏడాదిన్నరగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.. నేను పదో తరగతి వరకే చదివానని పట్టాభి అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లోనూ నేను స్పష్టం చేశానన్న ఆయన.. ఎన్టీఆర్ పెట్టిన తెదేపాను లోకేష్ పునాదులతో సహా పెకలిస్తారని.. తెదేపా బ్రోకర్ల పార్టీగా తయారైంది అంటూ హాట్ కామెంట్లు చేశారు.. గ్రాఫిక్స్ లు చూసి అమెరికాలో ఉన్నవారూ అమరావతిలో కోట్లు పోసి నష్టపోయారని విమర్శించిన కృష్ణప్రసాద్.. రాజధాని అమరావతిలో రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తుందనే ఆరోపణలను ఖండించారు.. రాజధానిలో రోడ్లను ఎక్కడైనా ప్రభుత్వం తవ్విస్తుందా? అని ప్రశ్నించారు.
Also Read
- Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
- Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
- Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
- Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?