శాసనమండలి రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధాన నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు విషయంలో అప్పటి ఛైర్మన్ నిబంధనల ప్రకారం నడుచు కోలేదని, ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ అప్పటి మండలి చైర్మన్ వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీసీల హక్కుల కోసం…
తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.. వైసీపీకీ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్త సైదాపై వారి కార్యకర్తల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? అంటూ పోలీసులపై విమర్శనాస్త్రాలను సంధించారు. పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా అంటూ పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.…
ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో…
మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాడే పల్లిలోని మహానాడు ప్రాంతం లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శాసనసభలో మా తల్లిని అవమానించారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించు కున్నారని లోకేష్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు…
లెక్కలు తారుమారు అవుతున్నాయా? ఎన్నిక ఎన్నికకూ ఈక్వేషన్స్ మారుతున్నాయా? రేస్లో ముందున్నవారు.. తాజా లెక్కలతో తారుమారు అవుతారా? ఓటు బ్యాంక్ కోసం.. అధిష్ఠానం అదే ఊపులో వెళ్తే అమాత్య పదవిపై ఆశలుపెట్టుకున్న వారికి నిరాశ తప్పదా? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారిన సమీకరణాలు..! విశాఖజిల్లా అధికారపార్టీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. స్ధానిక సంస్ధల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వైసీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సామాజిక న్యాయం ప్రధానాంశంగా ఇక్కడ పదవుల పంపకం చేస్తోంది…
నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో మూడోసారి.. ఈరోజు ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదటిగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగుగుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల అధికారి నుంచి కేశినేని నానికి సమాచారం అదింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో…
మోజార్టీ పెరిగిందనే ప్రభుత్వం కౌన్సిల్ రద్దు పై వెనుకడుగు వేసిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆనాడు మెజార్టీ లేదని కౌన్సిల్ రద్దు చేస్తా మన్న ప్రభుత్వం , ఈనాడు అధికారపార్టీ మోజార్టీ పెరిగిందని మాట తప్పడం సిగ్గు చేటన్నారు.కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వ మేనని తాము గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దుచేయడం, తిరిగి ఏర్పాటుచేయడమనేది రాష్ట్రాల చేతిలో ఉండదు. పెద్దల సభలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాల న్నఆలోచన ఈ…
రాష్ర్టంలో బీసీ కులాల వారీగా జనగణన జగరడం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడారు. బీసీ కులాల వారిగా జనగణన జరకపోవడం వల్ల ఆయా వర్గాల వారి సంఖ్య ఎంతో, వారికి లభిస్తునన ప్రాతినిధ్యం ఎంతో తెలియడం లేదన్నారు. బీసీ కులాల జనగణన జరిగితే ఈ వర్గాలకు మరింత మేలు చేయటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుం ది.జనగణన పట్టికలో…
రేపు ఉదయం 10:30కు కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక జరుగనుంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ రేపే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని తెలిపింది. నిన్న, ఇవాళ జరిగిన ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను అడ్డుకునేలా అధికార పార్టీ వ్యవహరించిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది… వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాల్లో చేసిన హంగామాకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కేశినేని నాని ఓటు…
రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా…