రేపు ఉదయం 10:30కు కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక జరుగనుంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ రేపే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని తెలిపింది. నిన్న, ఇవాళ జరిగిన ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను అడ్డుకునేలా అధికార పార్టీ వ్యవహరించిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది… వైసీపీ సభ్యులు కౌన్సిల్ హాల్లో చేసిన హంగామాకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కేశినేని నాని ఓటు…
రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా…
హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని… మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ఆగ్రహించారు జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర…
బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులను తప్పుదారి పట్టిం చాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నేడు బిల్లులు వెనక్కు తీసుకు నేలా చేసిందన్నారు. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉంపసంహరణ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కు పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు. బిల్లులు విత్ డ్రా చేయడాన్ని స్వాగతిస్తున్నాం..కానీ…
రాజధాని బిల్లుల ఉపసంహరణపై టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ, సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసం హరణ మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్ వైఖరి రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూర్చుతుందని ఆయన ఆరోపించారు.సీఎం జగన్ వైఖరితో రాష్ర్టానికి తీవ్ర నష్టం జరగుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరిచారన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను దెబ్బ తీసేందుకే జగన్ అనాలోచిత చర్యలు చేపడుతున్నారన్నారు. అమరావతి రైతులు…
రాజధాని అందరికి అందుబాటులో ఉండాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ నాయకులు వంచన మాట లను బయట పెట్టారని ఆయన విమర్శించారు. శ్రీ బాగ్ ఒడంబడికని ఒకసారి చదివి ప్రవేశ పెట్టాలన్నారు. రాయలసీమ అవసరాలు తీర్చా కే ఇతర ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరపాలన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క పని సరిగ్గా చేయడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి…
అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని…
అధికార వైసీపీ భీమవరంలో ప్రత్యేక పొలిటికల్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? కుల సమీకరణాల ద్వారా పూర్తిస్థాయిలో పాగా వేయబోతుందా? ఎవరు ఎవరితో కలిసినా భీమవరాన్ని శత్రుదుర్బేధ్యం చేయాలని చూస్తోందా? వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పక్కాగా పావులు కదుపుతోందా? ఇంతకీ ఏంటా ఎత్తుగడలు? సైలెంట్గా భీమవరంలో వైసీపీ పొలిటికల్ ఆపరేషన్..! ఆపరేషన్ కుప్పం ద్వారా అధికార వైసీపీ చంద్రబాబు ఇలాకాలో ఏ విధంగా పాగా వేసిందో చూశాం. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారే తప్ప.. అక్కడ పంచాయతీ, పరిషత్,…
వైసీపీ ప్రభుత్వం పై పవన్ ఫైర్ అయ్యారు. ఓ వైపు రాష్ర్టంలో పరిస్థితులు అస్తవ్యవస్తంగా ఉంటే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. రాష్ర్టం లో అరాచక పాలన నడుస్తుందని అన్నారు. ఓ వైపు భారీ వర్షాలతో వరదల భీభత్సంతో ఒక వైపు రాష్ర్టాన్ని కుదిపేస్తుంటే, ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి రోడ్డున పడ్డారన్నారు. పశునష్టం, పంట నష్టం జరిగిందని వరద నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదని ఆయన…
అసెంబ్లీ ఎపిసోడ్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మరోసారి స్పందించారు. అసెంబ్లీ అనేది చట్టాలు చేసే పవిత్రమైన స్థలమని… అసెంబ్లీలో భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సభ లో భిన్నమైన వాతావరణం ఉంది.. ప్రజా సమస్యలపై కాకుండా వేరే రకమైన చర్చ జరుగుతోంది.. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని… విభజన చట్డంలోని 90 శాతం అంశాలు పూర్తయ్యాయని…